కదనభేరి సభ (Kadana Bheri Sabha) :
కరీంనగర్ కదన భేరి సభ(Kadana Bheri Sabha)కు వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను గుర్తించినట్లు కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. నేడు శనివారం ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏర్పాట్లతో పాటు పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ…తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఈ నెల 12 న ఎస్ ఆర్ ఆర్ కళాశాల మైదానం లో సాయంత్రం జరిగే కరీంనగర్ కదనభేరి సభకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు హాజరవుతున్నా..ఈ సభకు కరీంనగర్ పార్లమెంటులోని 7 నియోజకవర్గాల నుండి లక్షకు పైగా జనాలు వస్తారని వెల్లడించారు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కరీంనగర్ నుండి 20వేల మంది, మానకొండూర్ హుజురాబాద్ హుస్నాబాద్ చొప్పదండి వేములవాడ సిరిసిల్ల.. ఒక్కో నియోజకవర్గం నుండి 15 వేల మంది హాజరువుతున్నట్లు చెప్పారు. కదనభేరి సభకు పెద్ద ఎత్తున రైతులు, యువకులు, మహిళలు హాజరవుతున్నట్టు వెల్లడించారు. సిరిసిల్ల, వేములవాడ, హుజరాబాద్ హుస్నాబాద్, మానకొండూరు, నియోజకవర్గాల నుండి వచ్చే వాహనాలకు సెయింట్ జాన్, సెయింట్ అల్ఫోర్స్ పాఠశాలలో కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాలనుండి వచ్చే వాహనాల కోసం రేకుర్తి ఈద్గా, శుభం గార్డెన్, లో మరియు కార్లు, ఆటోలతో పాటు చిన్న వాహనాలను డి మార్ట్ వద్ద పార్కింగ్ స్థలం గుర్తించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్ మాజీ గ్రంథాలయ చైర్మన్లు ఏనుగు రవీందర్ రెడ్డి పొన్నం అనిల్, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్ గందె మహేష్ ఏసిపి విజయ్ కుమార్, సీఐ లు సృజన్ కుమార్, ఓ.రమేష్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పర్శ రమేష్ తదితరులు ఉన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 89727