అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీటీసీని ఎంపీగా గెలిపించబోతున్నామని అన్నారు. ‘ప్రజాగళం’ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర మార్చే కీలక తరుణమిదన్నారు.. ఏపీ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలు ఇవని తెలిపారు. వైసీపీని చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమన్నారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు. సాధారణ కార్యకర్తకు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఘనత టీడీపీదేనని… ఎంపీటీసీని ఎంపీగా నిలబెట్టి గెలిపించబోతున్నామన్నారు. జగన్ పేరు మార్చి.. జే..గన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నానని చంద్రబాబు తెలిపారు.
kurnool district news
శ్రీ రామనవమి (Sri Rama Navami) :
నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీ రామనవమి (Sri Rama Navami) సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం దేవస్థానం ఘనంగా నిర్వహించింది. దేవస్థానానికి అనుబంధ అలయమైన ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుండి శ్రీ సీతారామస్వామికి శ్రీ ప్రసన్నాంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించి పూజలనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.
ఇది చదవండి : ఈ నెల 17న శ్రీరామనవమి తిరు కళ్యాణ మహోత్సవం
కళ్యాణోత్సవానికి ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం ఫాటించి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ, వృద్ధి అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవాచనం, కంకణపూజ, యజ్ఞోపవీత పూజ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, మాంగల్య పూజ, శ్రీసీతాదేవికి మాంగల్య ధారణ, తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో శాస్త్రోక్తకంగా సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దేవస్థానం అధికారులు, సిబ్బంది స్థానికులు భక్తులు తిలకించారు అనంతరం దేవస్థానం భక్తులకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు ఐదు రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్టలో జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా..నేడు ఉదయం 8 గంటలకు పాతగుట్ట ఆలయంలో జయంతి… - కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్లో పూరం ఉత్సవాలు..
కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్లో ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఏప్రిల్–మే నెలల్లో వడక్కున్నథన్ ఆలయంలో జరిగే ఈ వేడుక రాష్ట్రంలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవంగా గుర్తింపు పొందింది. సుమారు 36 గంటల పాటు కనులవిందుగా సాగే… - తిరుమలలో వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం
తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లో దశావతార–అష్టలక్ష్మి మండపాన్ని భూలోక వైకుంఠాన్ని తలపించేలా అద్భుతంగా అలంకరించారు. రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గజవాహనంపై మలయప్ప స్వామివారు దర్శనమిచ్చి, పల్లకిపై మండపానికి వేంచేపు చేశారు.…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: శ్రీశైలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు…
మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలో వైసీపీ చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీ నేత చూడి ఉలిగయ్య ఆధ్వర్యంలో, మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి 200 మంది వైసిపి కార్యకర్త లకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామంలో దాదాపు 20 కుటుంబాలు ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. రేపు రాబోయే ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి కి బిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు అని అలాంటి వారిని మతిస్థిమితం లేదని అనటం సమంజసం కాదు అని హితువు పలికారు . నాకూ సరైన పోటీ ఎవరూ లేరని అన్నారు. నేను గెలిచి మంత్రాలయం లో టీడీపీ జెండా ఎగురవేస్తామన్నారు.
శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఈనెల 6 నుండి 10 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈనేపథ్యంలో దేవాదిదేవుడిని తనివితీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా కాలినడకన పాదయాత్రగా కన్నడ భక్తులు వేలాది తరలివస్తున్నారు. నల్లమల అంత ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది ఉగాది పర్వదినం సమీపిస్తుండటంతో శ్రీగిరి మల్లయ్యను ధ్యాన మల్లన్న తండ్రి అదుకో అంటూ ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు. నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద మంచినీటి సౌకర్యం గతం కంటే బాగుందని అయితే అటవీ మార్గం మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉన్న ఏర్పాట్లు బాగున్నాయని కన్నడ భక్తులంటున్నారు.
నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే కన్నడ భక్తుల భజనలతో మార్మోగుతున్న శ్రీశైలం మరోపక్క వైద్య సదుపాయాలు బాగున్నాయని అడవి మార్గంలో బీమకొలను మీదుగా కొండెక్కి కన్నడిగులు పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్న నేపద్యంలో దేవస్థానం అధికారులు లక్షలు ఖర్చుపెట్టి కాలినడకన నల్లమల నుండి వచ్చే కన్నడ భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించారని పాదయాత్ర భక్తుల కోసం అడవిమార్గంలో రాళ్లు రప్పలు లేకుండా కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు దారి వెంట ట్రాక్టర్లతో నీరు చల్లడం వచ్చే భక్తులకు మార్గమధ్యలో దేవస్థానం సహకారంతో స్వచ్చంద సేవకర్తలతో అన్నదాన ఏర్పాటు చేశారు. కన్నడ భక్తులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆడపడుచును తనివితీరా చూసేందుకు ఎండను సైతం లెక్కచేయకుండా మండుటెండలో ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటాపురం నుండి దట్టమైన అటవీప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్లు నడుచుకుంటున్న వస్తున్న పాదయాత్ర కన్నడ భక్తుల కోసం పలువురు దాతలు కూడా మజ్జిగ, పండ్లు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు భక్తుల సౌకర్యాలపై దేవస్థానం ఈవో పెద్దిరాజు ప్రత్యేక దృష్టి పెట్టడం సంతోషంగా ఉందని పలువురు కన్నడ భక్తులు తెలిపారు.
వాలంటీర్ల (Volunteers) రాజీనామా..
నంద్యాల మండలం అయ్యలురు గ్రామానికి చెందిన 27 వాలంటిర్లు (Volunteers) మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పంచాయతీ కార్యదర్శికి రాజీనామా పత్రాలను అందజేచారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ టీడీపీ నాయకులు పించన్ ఇవ్వకుండా అడ్డుపడుతూ లేడీస్ ని మాయం చేస్తున్నారని మాట్లాడిన మేము బాధపడలేదు కానీ వాలంటీర్లలో ఆడపిల్లలు కూడా ఉన్నారు కదా మేము ఎందుకు అలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి నెల ఒకటవ తేదీన ఉదయమే నిద్ర లేచి అక్కా, చెల్లెమ్మలకు అవ్వ, తాతలకు పించన్ ఇచ్చే వాళ్ళమని అలాంటి మా మీద లేనిపోని నిందలు వేస్తూ ఇలా మాట్లాడటం దారుణమన్నారు. కరోనా కాలంలో ఎవరు బయటికి రాని సమయంలో కూడా ప్రజలకు సేవలందించామని తెలిపారు. చిన్న జీతమైన సొంత ఊరిలో ఉద్యోగం చేస్తూ రాజకీయాలకు అతీతంగా మేము ఎంతోమందికి సేవ చేశామని అయినా కూడా ప్రతిపక్ష నాయకులు మాపై కక్షపూరితంగా లేని పోనివి మాట్లాడం దారుణమన్నరు. మళ్ళీ జగన్ ను గెలిపించడం కోసం జగన్ చేసిన సేవలను ప్రజలకు తెలియజేస్తూ స్వచ్ఛందంగా ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు.
ఇది చదవండి : మద్యం మత్తులో విదేశీయుడి వీరంగం…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 29వ తేదీ న బనగానపల్లెలో పర్యటన చెయనున్నారు. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు చేయబోతున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు కొనసాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజాగళం పేరుతో ఈనెల 27వ తేదీ నుంచి వరుసగా పర్యటనలను ఆయన చేయనున్నారు. అందులో భాగంగా ఈ నెల 29వ తేదీ బనగానపల్లెలో పెట్రోల్ బంక్ కూడలి వద్ద ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు పర్యటనకు సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టిడిపి బనగానపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన వల్లభనేని రామారావు కృష్ణకుమారి దంపతులు స్వామి అమ్మవార్లకు వెండి వస్తువులను బహుకరించి మొక్కలు తీర్చుకున్నారు. 740 గ్రాముల వెండి బిందె, 390 గ్రాముల వెండి ప్రమిదలు, 2, 150 గ్రాముల వెండి ప్లేటు 1, 160 గ్రాముల వెండి అక్షింతల గిన్నెలు, 2,350 గ్రాముల అగరుబత్తి స్టాండ్ దేవస్థానం ఏఈఓ స్వాములుకు అమ్మవారి ఆలయంలో అందజేసినట్టు ఈఓ పెద్దిరాజు తెలిపారు. అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో వల్లభనేని రామారావు దంపతులకు ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించగా అర్చకులు వేదపండితులు స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనలు చేశారు.
మంత్రాలయం టిడిపి ఇంచార్జీ పి తిక్కరెడ్డికి టికెట్ అధిష్టానం కేటాయించక పోవడంతో మంత్రాలయంలో భవిష్యత్తు ప్రణాళిక కోసం టిడిపి నేత పి తిక్కరెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. టిడిపి శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నంకు పాల్పడ్డారు. మరో వ్యక్తి గోడకు తల బాదుకొని ఆత్మహత్యయత్నంకు పాల్పడ్డాడు. రక్త స్రావం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిరసనలు, ధర్నాలు వెలు వెత్తాయి. టిడిపి శ్రేణులు రోడ్డుపై బైఠాయించి టైర్లు దగ్ధం చేశారు. మంత్రాలయం మండలంలో టిడిపి నాయకులు సభ్యత్వంకు, పార్టీ పదవులకు రాజీనామాలు చేసి రాఘవేంద్ర సర్కిల్ లో ధర్నా నిర్వహించారు. మంత్రాలయం ఇంచార్జీ పి తిక్కరెడ్డిని తప్పించి గత రెండు నెలల క్రితం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టిడిపి పార్టీలోకి వచ్చిన బిసి నాయకుడు ఎన్ రాఘవేంద్ర రెడ్డి కి టిడిపి ఆధిష్టానం టికెట్ కేటాయించడంతో టిడిపి నేత పి తిక్కరెడ్డి వర్గాలు రాజీనామాలు చేస్తున్నారు. ఆధిష్టానం ఆలోచించి తిక్కరెడ్డికి టికెట్ కేటాయించాలని ఓడిన 10 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటూ సేవలు చేస్తున్నారని తెలిపారు.
పేదల భవిష్యత్తుపై యుద్ధానికి చంద్రబాబు కూటమి మరోసారి సిద్ధమైందని.. ఈ ఎన్నికల్లో ఓటు అనే దివ్యాస్త్రాన్ని వాళ్ల మీద ప్రయోగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల సందర్భంగా చంద్రబాబు, దత్తపుత్రుడుపై ధ్వజమెత్తారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. పేదరికానికి కులం ఉండదని… పేదవాడు ఎక్కడ ఉన్నా కూడా వారికి తోడుగా ఉండగలిగే మనసు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండాలన్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తంగానీ, వైఎస్సార్ కాపు నేస్తంగానీ మేనిఫెస్టోలో పెట్టినవి కావని… అయినా వారికి తోడుగా ఉండాలనే వీటిని అమలు చేస్తున్నామని జగన్ తెలిపారు.
శ్రీశైలంలో వచ్చేనెల 6 నుంచి 10 వరకు 5 రోజులపాటు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి శ్రీశైల ఆలయ ఈవో పెద్దిరాజు దేవస్థానం పరిపాలన భవనంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు స్థానిక పోలీసులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొదటగా ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసినందుకు దేవస్థానం అధికారులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ ఉగాది మహోత్సవాలను సమర్థవంతంగా జరిగేలా సిబ్బంది అంతా కృషి చేయాలన్నారు. ఉగాది మహోత్సవాల ఏర్పాట్లకు సంబందించిన అంశాలను చర్చించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు జారీచేశారు. అధికారులందరు పరస్పర సమన్వయంతో ఉత్సవాలను ఎటువంటి లోటు పాట్లు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అదేవిధంగా క్షేత్రానికి వారం రోజుల ముందు నుండే కర్ణాటక, మహారాష్ట్ర కన్నడ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని, పాదయాత్ర మార్గంలో విచ్చేసే కన్నడ భక్తులకు భీమునికొలను కైలాసద్వారం అలానే అటవీ మార్గంలో వేయి లీటర్ల సింటెక్స్ ట్యాంకులు 8 ఏర్పాటు చేయాలని కన్నడ భక్తులకు ఎంటుంటి అసౌకర్యం కలగకుండా నీటి కోసం ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అలానే క్షేత్రపరిదిలో భక్తులకు అవసరమైన తాత్కాలిక వసతి, త్రాగునీరు, విశ్రాంతి సెమియనలు ఏర్పాట్లు చేయాలని కన్నడ భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిదిలో పలు సమాచార కేంద్రాలు, కన్నడ భాషలో సూచిక బోర్డ్స్ పెట్టాలన్నారు. ఉగాది మహోత్సవాల ఏర్పాట్లన్ని ఈనెల 29 లోపు పూర్తి చేయాలని అధికారులకు ఆలయ ఈవో పెద్దిరాజు ఆదేశించారు.







Total views : 56860