కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో కరగ్రహారం, క్యాంబిల్ పేట, చిన్నకరగ్రహారం, పల్లిపాలెం, నవీన్ మిట్టల్ కాలనీ, మేకవాని పాలెం, తాళ్లపాలెం, మంగినపూడి, తుమ్మలచెరువు, పేద యాదర, చిన యాదర, భోగిరెడ్డిపల్లి, నెలకుర్రు చిన్నాపురం, గ్రామాలలో నీట మునిగి దెబ్బతిన్న వరి, వేరుశనగ, మినువు పంటలు ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో మొత్తం పొలాలు నీళ్లతో నిండిపోయి, అమ్ముకోవడానికి వీలు కాకుండా కుళ్లిపోయి నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి తక్షణమే అధికారులు స్పందించి రైతాంగానికి ఇన్సూరెన్స్ కింద ఆదుకోవాలని కోరిన మాజీ మంత్రి వర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర వారితో పాటు మచిలీపట్నం నియోజకవర్గ రూరల్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Tag:
lose of crop field
ఏలూరు జిల్లా…. ద్వారక తిరుమల మండలం గుండుగోలు గుంట గ్రామo మిచాంగ్ తుఫాన్ గత రెండు రోజులు గా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సుమారు 20 ఎకరాల అరటి మొక్కలు నేలకొరిగాయి, 40 ఎకరాలు మొక్కజొన్న పంట కొట్టుకుపోయింది. చెరువును తలపిస్తున్న మొక్కజొన్న చేలును కౌలు చేస్తున్న రైతులు చూసి లబోదిబో అంటున్నారు. తడిసిన వరి చేలు, తడిసిన ధాన్యాన్ని బస్తాల్లోకి ఎక్కిస్తున్నారు. సుమారుగా ఇంచుమించు ఒక రైతుకే 12 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని అధిక వడ్డీలకు తీసుకొని కౌలుకు తీసుకోవడం జరిగిందని మించాగ్ తుఫాన్ పరిస్థితి వల్ల తన పరిస్థితి అయోమయంలో పడిందని వాపోతున్నారు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూపు చూస్తున్నామని, త్వరగా ప్రభుత్వం కౌలు రైతులను, రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం తమ కష్టాలను పట్టించుకోవాలని కోరుకుంటున్నారు.




Total views : 54587