కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, 53 మద్యం సీసాలను, 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకున్న గన్నవరం పోలీసులు. సాధారణ తనిఖీలలో భాగంగా గన్నవరం మండలం కేసరపల్లి- సవారిగూడెం జంక్షన్ వద్ద వాహనాలు చెకింగ్ లో భాగంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులు. వారి వద్ద నుండి 53 మద్యం సీసాలను 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గన్నవరం పోలీసులు.
money
పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగతో పాటు మరో ఇద్దరిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురి నుంచి సుమారు రూ. 12 లక్షల రూపాయల విలువచేసే 24 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనంచేసుకున్నారు. వీరిపై ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో 50 కి పైగా కేసులు నమోదయ్యాయి. దొంగలను పట్టుకున్న అనంతపురము రూరల్, పుట్లూరు మరియు గుంతకల్లు వన్ టౌన్ పోలీసులను ఎస్పీ అభినందించారు. జల్సాలకు అలవాటుపడి డబ్బు సంపాందించాలని దొంగతనాలకు అలవాటు పడ్డారని ఎస్పీ తెలిపారు.
కుత్బుల్లాపూర్జీ డిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ లో నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓ రాజకీయ పార్టీకి చెందిన లక్ష రూపాయల నగదును 5000వేల చొప్పున కవర్ లో పెట్టీ తరలిస్తున్న అఖిల్ అనే వ్యక్తి ని బాలనగర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తి సమ్మక్క సారక్క క్రషర్ లో ఉద్యోగి గా గుర్తించారు. అనంతరం జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




Total views : 56859