చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కృష్ణా రెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలకు సంబంధించిన స్కూల్ బస్సు మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో దండపల్లి రూట్ నందు ఆగిపోయింది. ఏంటా అని ఆరా తీస్తే వాహనం డీజిల్ సప్లై కాలేదని డ్రైవర్ తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ఎక్కడబడితే అక్కడ ఆగిపోతున్న స్కూల్ బస్సు .ఒకవేళ అటవీ ప్రాంతంలో ఎక్కడైనా ఆగిపోతే పిల్లల పరిస్థితి ఏంటి అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ప్రతి ఒక్క బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసే రోడ్డుపైకి వచ్చేటట్లు చేస్తున్నామని తెలిపినా ఇలాంటి ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యమా అధికారుల పర్యవేక్షణ లోపమా అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధించిన స్కూలుపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశంతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. పార్టీ…
- శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపై అధికారులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాగార్జున సాగర్ నుండి…
- జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం..రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి…
- సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిశ్వశర్మ..హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారంతో అసోం రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. గౌహతిలోని ఖానాపరాలో జరిగిన వేడుకలో హిమంత బిశ్వ శర్మ అసోం ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణం…
- బ్లాక్ బస్టర్ ‘శంబాల’ కాంబో రిపీట్.. బృందా రవీందర్ దర్శకత్వంలో ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్బ్లాక్ బస్టర్ ‘శంబాల’ కాంబో రిపీట్.. బృందా రవీందర్ దర్శకత్వంలో ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ సెన్సేషనల్ బ్లాక్బస్టర్ ‘శంబాల’తో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు, దర్శకుడు యుగంధర్ ముని, హీరో ఆది ఇండస్ట్రీలో హాట్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 74515