చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కృష్ణా రెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలకు సంబంధించిన స్కూల్ బస్సు మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో దండపల్లి రూట్ నందు ఆగిపోయింది. ఏంటా అని ఆరా తీస్తే వాహనం డీజిల్ సప్లై కాలేదని డ్రైవర్ తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ఎక్కడబడితే అక్కడ ఆగిపోతున్న స్కూల్ బస్సు .ఒకవేళ అటవీ ప్రాంతంలో ఎక్కడైనా ఆగిపోతే పిల్లల పరిస్థితి ఏంటి అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ప్రతి ఒక్క బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసే రోడ్డుపైకి వచ్చేటట్లు చేస్తున్నామని తెలిపినా ఇలాంటి ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యమా అధికారుల పర్యవేక్షణ లోపమా అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధించిన స్కూలుపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…
- ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైందని, ఫ్లోరెస్ ప్రాంతంలోని ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదైందని అంతర్జాతీయ భూభౌతిక కేంద్రాలు…
- నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు చెప్పింది. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.