చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కృష్ణా రెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలకు సంబంధించిన స్కూల్ బస్సు మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో దండపల్లి రూట్ నందు ఆగిపోయింది. ఏంటా అని ఆరా తీస్తే వాహనం డీజిల్ సప్లై కాలేదని డ్రైవర్ తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం, ఎక్కడబడితే అక్కడ ఆగిపోతున్న స్కూల్ బస్సు .ఒకవేళ అటవీ ప్రాంతంలో ఎక్కడైనా ఆగిపోతే పిల్లల పరిస్థితి ఏంటి అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ప్రతి ఒక్క బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసే రోడ్డుపైకి వచ్చేటట్లు చేస్తున్నామని తెలిపినా ఇలాంటి ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యమా అధికారుల పర్యవేక్షణ లోపమా అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధించిన స్కూలుపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్..కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్ పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో అరుణ్ కుమార్ పర్వతనేని డిఓపిగా గ్యాని సంగీతాన్ని అందించిన చిత్రం సూర్య బి పాజిటివ్. చరణ్ పీసర్ల హీరోగా, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్ గా…
- నాగావళి నదిపై వంతెన లేక 43 గ్రామాలకు రవాణా కష్టాలు..పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో ప్రజలు నేటికీ రవాణా కష్టాలతో నరకం అనుభవిస్తున్నారు. ఒకవైపు 22 పంచాయతీలు, మరోవైపు నాగావళి నది అవతల 9 పంచాయతీలు ఉండటం వల్ల ప్రజలు నది దాటకుండా మండల కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది.…
- అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు..వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గుంటూరు కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగారు. దీంతో ఆయనపై మరో కేసు నమోదు…
- ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర నియామకం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్రను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో విజిలెన్స్ కమిషనర్గా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. అనిల్ చంద్ర ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా…
- ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలుఅమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇవాల్టితో కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రెండోవిడత చర్చలు జరుగుతాయా, లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 47736