పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలు చేశాయి.సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు హాజరయ్యారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కార్మిక దినోత్సవం రోజున ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని విమర్శించారు.అంతేకాకుండా ఆయన ప్రజల సమక్షంలో డోప్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వివాదంపై స్పందించిన సీఎం భగవంత్ మాన్ సభా మర్యాదను కాపాడాలని ప్రతిపక్షాలను కోరారు. అసత్య ఆరోపణలతో సభను అవమానపరచవద్దని విజ్ఞప్తి చేశారు.
Tag:





Total views : 75342