సమ సమాజ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ సామాజిక మహా శిల్ప విగ్రహావిష్కరణ మహోత్సవానికి తరలివస్తున్న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం జనవాహన అందరికీ తాటిపర్తి చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని విధంగా సమసమాజ నిర్మాణ ఘట్టానికి పూనుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన కొని ఆడారు. మంచి సూపర్ పాలన అందించాలంటే మరల ముఖ్యమంత్రిని గెలిపించుకోవాలంటూ ఆయన జోష్యం చెప్పారు. మహోత్సవ విగ్రహావిష్కరణలో పాల్గొని ప్రతి ఒక్కరు జగనన్న సైనికులుగా అడుగులో అడుగు వేస్తూ జయప్రదం చేయాలంటూ ఆయన కోరారు.
Tatiparthi Chandrasekhar
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ గా సింగరాయకొండ కి చెందిన వ్యాపారవేత్త తాటిపర్తి చంద్రశేఖర్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నియమించిన విషయం తెలిసిందే. అయితే శనివారం నియోజకవర్గానికి వస్తున్న సంధర్బంగా త్రిపురాంతకం, యర్రగొండపాలెం లో స్వాగత ఫ్లెక్సీలు ఎర్పాటు చేసారు. ఆ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేశారు. త్రిపురాంతకం లోని ఫ్లైఓవర్ కు ఫ్లెక్సీ ఎర్పాటు చేయగా ఫ్లెక్సీ ను చించి వేశారు. యర్రగొండపాలెం లో మంత్రి సురేష్ అతిధి గృహానికి వెళ్ళే రహధారిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలను చించి వేశారు. సీసీ కెమేరాలు లేని చోట ఫ్లెక్సీలు చించడంతో ఎవరో కావాలనే ఫ్లెక్సీలను చించారని వైసీపీ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. దీంతో ఫ్లెక్సీల గొడవ యర్రగొండపాలెంలో చర్చాంశనీయంగా మారింది. ప్లెక్సీలను చించిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.





Total views : 54498