తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. పార్టీ శ్రేణులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. శ్రీకాళ హస్తి రూరల్ మండలంలోని కామ కొత్తూరు గ్రామంలోని చెంచయ్య నాయుడు ఇంటి వద్దకు వెళ్లి రూరల్ సీఐ అజయ్ కుమార్ అసభ్య పదజాలంతో దూషించండం వివాదంగా మారింది. ఇదే అంశంపై బొజ్జల సుధీర్ రెడ్డి..సీఐతో మాట్లేడేందుకు ప్రయత్నించగా. సుధీర్ రెడ్డి పై కూడా సీఐ అజయ్ కుమార్ అసభ్య పదజాలంతో దూషించడంతో వివాదం మారింత తీవ్రంగా మారిపోయింది. ఈ నేపధ్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున్న చేరుకున్న టీడీపీ శ్రేణులు స్టేషన్ ను ముట్టడించారు. సిఐ అజయ్ కుమార్ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలంటూ బైఠాయించారు. తిరుపతి SP తో ఫోన్లో మాట్లాడి… సిఐ అజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డి.ఎస్.పి కి వినతి పత్రం అందజేశారు.
Tdp
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ స్పష్టత ఇచ్చింది. పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. పేరుకే పోటీ చేయడం కంటే దూరంగా ఉండడమే ఉత్తమమని ఆ పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్కు అధినేత చంద్రబాబు సూచించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. స్కిల్ డెవల్పమెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు, జైలులో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని ఆ పార్టీ భావించింది. శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ సందర్భంగా కాసానికి చంద్రబాబు సూచించారు. చంద్రబాబుతో కాసాని ములాఖత్లో దీనిపై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు కాసాని కోరగాా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టిసారించలేదని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తే తెలంగాణలో కూడా పార్టీ సులభంగా బలపడుతుందని చంద్రబాబు సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకుంటే బాధపడాల్సి ఉంటుందని, ఇప్పటికైతే పోటీ కష్టమని అనిపిస్తోందని కాసాని జ్ఞానేశ్వర్కు సర్దిచెప్పినట్లు తెలిసింది. బరిలో దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలని, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూస్తున్నారు కదా అని సర్దిచెప్పినట్టు సమాచారం.
చంద్రబాబుపై కేసులకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు.. మరి 50 రోజులుగా వాటిని బయటపెట్టకుండా ఏంచేస్తున్నారని వైసీపీ నేతలపై నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించడం సహజమేనని అయితే ప్రత్యర్థిని చంపాలని చూడడం వైసీపీ నేతలకే చెల్లిందని ఆరోపించారు. చంద్రబాబు జైలులోనే చనిపోతారంటూ వైసీపీ నేతలు చెబుతున్నారని లోకేశ్ గుర్తుచేశారు. కేసులతో ఎలాంటి సంబంధంలేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. స్కాంలతో తమకు కానీ తమ పార్టీ నేతలకు కానీ బంధుమిత్రులకు కానీ ఎలాంటి సంబంధంలేదని లోకేశ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఉందని మీ దగ్గర ఏ చిన్న ఆధారం ఉన్నా ప్రజల ముందు పెట్టాలని వైసీపీ నేతలకు లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు.
గుంటూరు జిల్లా లాడ్జి సెంటర్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. నారా భువనేశ్వరికి అండగా చంద్రన్న తోడుకు టిడిపి శ్రేణులు శాంతియుత ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనకు అనుమతి లేదని గుంటూరు పోలీసులు అన్నారు. యాక్ట్ 30 అమల్లో ఉందని చెప్పడంతో, పోలీసులకి టిడిపి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలను చేసి, ప్రభుత్వం అక్రమ అరెస్టులతో కట్టడి చేయలేదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి అంబటి రాంబాబుకు ఖమ్మం జిల్లాలో నిరసన సెగ తగిలింది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. దీంతో అంబటి మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది నిరసన సెగ కాదని.. తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. అటువంటి దాడులను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఒక మంత్రిగా సెక్యూరిటీ ఉన్న తనపైనే కొందరు ఉన్మాదులు దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. హఠాత్తుగా ఒక పది మంది వేసేస్తామని తనను బెదిరించారని చెప్పారు. ఒకే సామాజికి వర్గానికి చెందిన వ్యక్తులే తనపై దాడికి యత్నించారన్నారు. డబ్బు మదంతో కొందరు ఉన్నాదులు పేట్రేగిపోయారని.. కులోన్మాదులపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఉన్మాదులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాజమండ్రి జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. దీనిపై చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు. తన ప్రాణాలకు ఏ విధంగా ముప్పు ఉందో చంద్రబాబు గారు రాసిన లేఖ తనను నిలువునా కుదిపేసిందని తెలిపారు. జైలులో చంద్రబాబు ఎదుర్కొంటున్న అవాంఛనీయ పరిస్థితులను తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని వెల్లడించారు. జైలు గోడల ఆవల ఉన్న తన భర్త క్షేమం కోసం తనతో కలిసి ప్రార్థించాలని రాష్ట్రంలోని సోదరీమణులందరినీ అర్థిస్తున్నానన్నారు. నారా బ్రాహ్మణి కూడా స్పందిస్తూ వారిని ఆ లేఖ తీవ్రంగా ఆందోళనకు గురి చేసిందన్నారు. జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు నారా బ్రాహ్మణి.
వైసీపీ వాళ్లది ధన బలమైతే.. తెలుగుదేశం పార్టీది ప్రజా బలమని నారా భువనేశ్వరి అన్నారు. 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో తెదేపా-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు మంచివారైతేనే ప్రజలకు మేలు జరుగుతుందని, చెడ్డవారైతే ప్రజలకు కీడు జరుగుతుందని అంబేడ్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా మారిందని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును 49 రోజులుగా జైల్లో పెట్టారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం తప్పా, అమరావతి రాజధాని నిర్మించడం తప్పా, పోలవరం కట్టడం తప్పా. ఆయన చేసిన నేరం ఏమిటి? అని భువనేశ్వరి ప్రశ్నించారు.
నిధులు కేటాయించకుండానే విధులు కేటాయించే దౌర్భాగ్య పరిస్థితులు ఏపీలో దాపురించాయని మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చాగోష్ఠి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ఆ పార్టీ నేతల దోపిడీ విధానాలను వివరిస్తూ..తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నదుల అనుసంధానంతో..నీటిని మరొకప్రాంతానికి తరలించుకునే అవకాశం ఉన్నప్పటికీ..ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో ఏడాదికి మూడు వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుందన్నారు. కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం పూర్తయినా..నీటిని తెచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఏ కోశానా చేయడంలేదన్నారు.జిల్లాలోని మెట్టప్రాంతాలు నీటి కోసం వేడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. వైకాపా పాలనలో రైతుల గోడును తీర్చే నాధుడే కరువయ్యాడని మండిపడ్డారు.కొసమెరుపుగా మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పై సెటైర్స్ వేశారు. సైదాపురం అక్రమ మైనింగ్ అంతా టిడిపి నేతలదే అని వ్యాఖ్యానించిన మాజీ మంత్రి అనీల్ యాదవ్ తాను కూడా తన మనుషుల ద్వారా అక్రమ మైనింగ్ త్రవ్వకాలు జరిపినది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు
ఇవాళ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులతో నాదెండ్ల మనోహర్ ఫోన్ కాల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా స్థాయి సమన్వయ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. జనసేన-టీడీపీ సమన్వయ సమావేశాలు విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీ చేయి కలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, ఇటీవల ఇరు పార్టీల సమన్వయ కమిటీ తొలిసారిగా భేటీ అయింది. జిల్లా స్థాయిలోనూ సమన్వయ సమావేశాలు జరపాలని కమిటీ భేటీలో నిర్ణయించారు. అదే సమయంలో, రెండు పార్టీలు కలవకూడదన్న ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీ వ్యక్తులు కుట్రలు చేస్తున్నారని, వారి ఉచ్చులో పడొద్దంటూ పార్టీ శ్రేణులను నాదెండ్ల అప్రమత్తం చేశారు. ఇక, పొత్తులోకి బీజేపీ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. జనసేన తరఫున ఆయా జిల్లాల పరిధిలోని ఇన్చార్జులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులతో కలిపి 50 మంది వరకు సమన్వయ సమావేశంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించినట్టు వివరించారు.
నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం ప్రారంభమైంది. నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నారా భువనేశ్వరి…చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనస్థాపం చెంది మృతి చెందిన చంద్రగిరిలోని ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. మధ్యాహ్నం 3 గంటలకు అగరాలలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేపు తిరుపతి, శుక్రవారం శ్రీకాళ హస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనున్నారు.






Total views : 89204