పల్నాడు జిల్లా , గురజాల మండలం ,జంగమహేశ్వరపురం గ్రామంలో జరిగిన కృష్ణారెడ్డి హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే యరపతినేని స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈసందర్బంగా యరపతినేని మాట్లాడుతూ..మహేష్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయని మండిపడ్డారు. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 11 మంది చనిపోయారని, కాసు మహేష్ రెడ్డి చేసే అక్రమ మైనింగ్ వల్ల ఎనిమిది మంది చిన్నారులు చనిపోయారని అన్నారు. మహేష్ రెడ్డి ఓటమి అంచున ఉన్నారని రాబోయే ఎన్నికలలో తనను ఢీకొనలేకనే తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని అన్నారు.
Tdp
రాజకీయంగానే కాకుండా చంద్రబాబు విజన్పై కూడా ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఐటీ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు. గూగుల్లో ఆయన చేసిన అభివృద్ధి పనులు కనిపించకుండా కేవలం స్కిల్ డెవలప్మెంట్ కేసు మాత్రమే కనిపించేలా చంద్రబాబు పేరును అబాసుపాలు పేర్కొన్నారు. ఐటీ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచే హైదరాబాద్లోని సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏళ్లు ఘనంగా నిర్వహించేందుకు అక్టోబరు 29న గచ్చిబౌలి మైదానంలో పెద్ద ఎత్తున మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించబోతున్నట్లు ఐటీ ఉద్యోగులు తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన iamwithcbn.co వెబ్ సైట్ ను జూబ్లీహిల్స్ లో లాంఛనంగా ఆవిష్కరించారు. చంద్రబాబుపై కృతజ్ఞత చూపించే ఐటీ ఉద్యోగులు, వివిధ రంగాల్లో స్థిరపడిన అభిమానులంతా వెబ్సైట్లో తమ పేరు నమోదు చేసుకొని గచ్చిబౌలిలో నిర్వహించండి స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ కూడా జైల్లో ఉన్నారని, ఏపీ ప్రజల కోసం చంద్రబాబు జైల్లో ఉండటం వల్ల ఆయనకు ఎలాంటి మలినాన్ని అంటుకోదని పేర్కొన్నారు.
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామంలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జగనాసుర పేపర్లను దహనం చేస్తు, సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము, కార్య నిర్వహన కార్యదర్శి గొనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గోన్నారు.
పవన్-లోకేష్ సమావేశాన్ని తేలికగా కొట్టి పారేసింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అసలు రెండు తెలుగు రాష్ట్రాలకు అసలైన తెగులు తెలుగుదేశం పార్టీయే అన్నారు ఆ పార్టీ నేత, మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు అశ్చర్యకరమైనవేమీ కావన్నారు. చంద్రబాబుకు బీటీమ్ లాంటి పవన్ కొత్త ప్యాకేజీ మాట్లాడుకున్నారని తెలిపారు. వారి మధ్య సాగిన చర్చ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, తెలుగుదేశం పరిరక్షణ కోసమే వారి చర్చలు అంటూ విమర్శలు గుప్పించారు.
మద్యనిషేధం చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్ముతోందన్నారు పవన్ కళ్యాణ్. ఏపీకి వైసీపీ అనే తెగులు పట్టుకుందన్నారు. ఆ తెగులు పోవాలంటే.. టీడీపీ – జనసేన వ్యాక్సిన్ అవసరమని చెప్పారు. చంద్రబాబును అక్రమంగా అకారణంగా జైల్లో పెట్టారని, సాంకేతిక అంశాల పేరుతో బెయిల్ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు మద్దతిచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యామన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే కలిశామని చెప్పారు. ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై చర్చించామన్నారు. టీడీపీ -జనసేన ఎలా కలిసి పని చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించామని, త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తామని పవన్ అన్నారు.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడేందుకు ఏర్పాటైన టీడీపీ-జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ సరికొత్త వ్యూహాలను ఖరారు చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు హోటల్లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు రెండు పార్టీల కమిటీ నేతలు భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనే విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు ఖరారు చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు.
తిరుపతి బహిరంగసభ ( Public Meeting ) :
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు..
Follow us on : Facebook, Instagram & YouTube.
చంద్రబాబు అరెస్ట్ వార్త విని ఆవేదనతో చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక, రేపు నారావారిపల్లి నుంచి నిజం గెలవాలి బస్సు యాత్ర స్టార్ట్ కానుంది. ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో నారా భువనేశ్వరి సహపంక్తి భోజనం చేయనున్నారు. చంద్రగిరి మండలంలోని అగరాల బహిరంగసభలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆమె మాట్లాడనున్నారు. అనంతరం తిరుపతిలోను భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తున్న జనసేన-టీడీపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు సంబంధించి ఈనెల 26న తిరుపతిలో వారిని పరామర్శించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తిరుపతిలో జరిగే బహిరంగసభలోను ఆమె ప్రసంగిస్తారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన మంగళగిరి టిడిపి కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. నవంబర్ 1 నుండి నారా లోకేష్ బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మరోవైపు నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు అరెస్టు తట్టుకోలేక అసువులు బాసిన కుటుంబాలను పరామర్శించేందుకు సిద్ధమయ్యారని, రాబోయే రోజుల్లో జగన్ పాలను అంతమొందించడమే టిడిపి జనసేన ప్రధాన లక్ష్యమని టిడిపి జనసేన కలిసికట్టుగా వైసీపీని ఓడించి తీరుతామంటున్న టిడిపి మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తపై పుంగనూరులో వైసీపీ నాయకుడు రెచ్చిపోయిన ఘటనపై నారా భువనేశ్వరి స్పందించారు. పుంగనూరు ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనమని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి ఒక ఉదాహరణ అని అన్నారు. పేదలపై పెత్తందారీ పోకడలకు నిదర్శనమన్నారు. తెలుగుదేశం అంటే ఒక కుటుంబమని, మా నేతలను అక్రమంగా జైలులో పెట్టారని నిరసన కూడా చేయకూడదా? అని ఆమె ప్రశ్నించారు. కార్యకర్తలకు సైకిల్ యాత్ర చేసే హక్కు కూడా లేదా? అని నిలదీశారు. ఎల్లకాలం నియంతల పెత్తనం సాగదు. అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అని భువనేశ్వరి అన్నారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేయడం, నిరసనలు, తదితర పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. చంద్రబాబు ఏపీలో అరెస్ట్ అయితే హైదరాబాదులో నిరసలేంటని మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేయడం, కేటీఆర్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి తప్పుబట్టడం వంటి అంశాలపైనా కవిత తన అభిప్రాయాలను పంచుకున్నారు.
పక్క రాష్ట్రంలోని రాజకీయాలపై ఉన్న శ్రద్ధ వారికి ఇక్కడి రాజకీయాలపై లేకపోవడం శోచనీయం అని రేవంత్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ దేశం మొత్తానికి రాజధాని కాబట్టి అక్కడ ధర్నాలు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదని కవిత పేర్కొన్నారు. హైదరాబాదులో ధర్నా చేయాలంటే తెలంగాణ అంశాలపై ధర్నా చేస్తే బాగుంటుందని హితవు పలికారు.
ఆంధ్రా అంశాలపై ఇక్కడెందుకు ధర్నాలు చేయాలి? అలాంటి కార్యక్రమాలతో హైదరాబాదులో శాంతిభద్రతలకు భంగం వాటిల్లదా? అని మాత్రమే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారని కవిత స్పష్టం చేశారు. దాన్ని పెద్ద వివాదం చేస్తున్నారని, ఎవరైనా ఎక్కడికైనా రావొచ్చు అంటూ రేవంత్ రెడ్డి అనవసరంగా భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయని, ఎప్పుడూ ధర్నాలు, గొడవలు, నిరసనలు, కర్ఫ్యూలు ఉంటాయని, ఆ పార్టీ చరిత్ర అదేనని కవిత ఎద్దేవా చేశారు. పరిస్థితులను బట్టి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కవిత విమర్శించారు.
చంద్రబాబు అరెస్ట్ అంశంపైనా కవిత తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. “ఒక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పక్క రాష్ట్రంలో చర్చ పెట్టాలనుకోవడం దారుణం. దేశంలో అనేక మంది రాజకీయ నేతలు వేధింపులకు గురవుతుండడడం చూస్తూనే ఉన్నాం. ఇది ఆయా పార్టీలు, వారి న్యాయ విభాగాలు చూసుకోవాల్సిన విషయం. తమ సమస్యను ప్రజల సమస్యగా చెబుతూ ప్రతి ఒక్కరినీ ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలని చూడడం అన్యాయం. ఇది టీడీపీ, వైసీపీ చూసుకోవాల్సిన విషయం” అని కవిత ఉద్ఘాటించారు.






Total views : 89152