తమిళనాడులో టీవీకే అధికారంలోకి వచ్చిన తరవాత సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో స్కూళ్లు, దేవాలయాలు, కాలేజీలకు దగ్గరలో ఉన్న మద్యం షాపులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారులతో చర్చించారని త్వరలోనే అమలు చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే రాష్ట్రంలో దేవాలయాలు, స్కూళ్లు మరియు కాలేజీలకు 100 మీటర్లు దూరంగా వైన్ షాపులు ఉండాలని కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. దీంతో విజయ్ కొత్తగా నిర్ణయం తీసుకోవడం ఏంటి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేవలం హైప్ కోసమే విజయ్ కి చెందిన పీఆర్ టీమ్ ఇటాంటి లీకులు ఇస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు ఈ విమర్శలను ఖండిస్తున్నారు. కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో చాలా చోట్ల వైన్ షాపులు స్కూళ్లు, దేవాలయాలకు దగ్గరలో ఉన్నాయని అంటున్నారు. కోర్టు ఆర్డర్లను పట్టించుకోకుండా వాటిని ఏర్పాటు చేశారని, ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అవి తెరుచుకునే ఉంటాయని అంటున్నారు. దీంతో ఎక్స్ లో టీవీకే కార్యకర్తలు వర్సెస్ ప్రతిపక్షాల కార్యకర్తలు అన్న చందంగా ట్వీట్స్ వార్ నడుస్తోంది.
Tag:





Total views : 75006