సామాజిక సాధికారక బస్సు యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం లు అంజద్ భాష , నారాయణస్వామి, బిసి శాఖ మంత్రి వేణుగోపాల్, బీద మస్తాన్ రావు వంటి పలువురు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు కార్యక్రమానికి హాజరై సాధికార యాత్ర విజయవంతం చేశారని ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ysrcp leaders
తన నివాసంపై గుర్తుతెలియని దుండగుల దాడి విషయంలో గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్ స్పందించారు. మతి స్దిమితం లేని వ్యక్తి, మద్యం మత్తులో చేసిన చేష్టలుగా పోలీసులు చెప్పారంటూ.. పోలీసులపై వ్యంగ్యాస్త్రాలు.. పోలీసులు చెప్పినది నిజమైతే హుందాగా వ్యవహరిస్తామని..అందులో నిజం లేకుంటే వైసిపి సత్తా ఏంటో చూపుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు విడుదల సమయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో ప్రతి వ్యాఖ్యలు చేశారు.
బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు బగళముఖి ఆలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎంఎల్సి పోతుల సునీత, ఎంఎల్ఏ కోన రఘుపతి ఈ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.





Total views : 89726