Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Main News ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభించాలని నిరసన..

ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభించాలని నిరసన..

by Rama
ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభించాలని నిరసన..

పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలోని రాజీవ్ రహదారిపై నిర్మించిన ఫ్లై ఓవర్ బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని బిజెపి నేతలు నిరసన చేపట్టారు. మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు రఘునాధరావు, రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుండి రామగుండం వరకు ఉన్న రాజీవ్ రహదారిపై పది సంవత్సరాల అనంతరం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించగా దానిని కాంట్రాక్టర్లు ఇంతవరకు ప్రారంభించకపోవడం శోచనీయమని విమర్శించారు. బ్రిడ్జ్ ప్రారంభించకపోవడం వల్ల రాజీవ్ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. బ్రిడ్జి నిర్మించకుండా టోల్ వసూలు చేస్తూ వాహనదారులను ఆర్థికంగా దోచుకుంటున్నారని విమర్శించారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.