54
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేసింది. భారీ వర్షం, ఈదురుగాలులు, ధూళి మేఘాలతో పలువురు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గాల్లోనే పది కి పైగా విమానాలు చక్కర్లు కొట్టాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానం కూడా తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ చివరకు సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఇక హైదరాబాద్-ఢిల్లీ ఇండిగో విమానానికి కూడా జైపూర్కు వెళ్లాలని ఏటీసీ సూచించింది. అయితే విమానంలో సరిపడా ఇంధనం లేదని పైలట్ తెలియజేయడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారు. తీవ్ర ప్రతికూల వాతావరణంలోనే పైలట్ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.






Total views : 89056