తిరుపతి నగరంలో అంబులెన్స్ మాఫియా రాజ్య మేలుతుంది. ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి చేర్చాలన్న, మృతి చెందిన వారి మృతదేహాన్ని ఇంటికి చేర్చాలన్న ప్రతిఒక్కరూ అంబులెన్స్ పై ఆధారపడతారు. ప్రజల అవసరాలను పావుగా వాడుకొని, అంబులెన్స్ మాఫియా రాబందుల్లా తయారైనది. గత ప్రభుత్వ హయాంలోని రాజకీయ నాయకుల మద్దతుతో ఈ మాఫియా విషనాగుగా తయారై ప్రజల నిస్సాహాయతపై కాటు వేస్తున్నారు. శవాల మీదా డబ్బులు ఏరుకోవడం అంటే ఏమిటో అప్పటి వైసిపీ ప్రభుత్వం హయాంలో ప్రజలు ప్రత్యక్షంగా చూసారు. ఇంత జరుగుతున్న కఠిన చర్యలు తీసుకోవాల్సిన రుయా సూపర్నంట్ అధికారులు నిమ్మకు నీరు ఎక్కినట్లు వ్యవహరిస్తున్నారు. యాక్సిడెంట్ అయిన వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని,మృతి చెందిన మృతదేహాలను, సైతం అంబులెన్స్ సహాయంతోనే గమ్యస్థానాలకు చేరుస్తారు.
మృతి చెందిన కుటుంబాలు పుట్టాడు దుఃఖంతో ఉన్న అవేమీ పట్టించుకోకుండా పైసానే పరమావధిగా భావించి వారి దగ్గర ముక్కు పిండి మరి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడినా కూడా గత ప్రభుత్వ వాసన వీడటం లేదని తిరుపతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చామంతి శ్రీనివాస్ మండిపడ్డారు.. ఈ దారుణాంపై వెంటనే చర్యలు తీసుకోవాలని . రుయా సూపర్డెంట్ ను విజ్ఞప్తి చేశారు. పేదల నుండి అధిక మొత్తంలో వసూలు చేస్తున్న సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు బిజెపి నాయకులతో కలసి వినతి పత్రం అందజేశారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది.…
- ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి…
- ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి.పశ్చిమాసియా యుద్ధ సెగ ఐటీ ఉద్యోగులకు తగిలింది. ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపాయి. కేవలం ముఖ్యమైన ఆహార…
- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం,…
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి