Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Andhra Pradesh తిరుపతి నగరంలో అంబులెన్స్ మాఫియా

తిరుపతి నగరంలో అంబులెన్స్ మాఫియా

by Satya
తిరుపతి నగరంలో అంబులెన్స్ మాఫియా

తిరుపతి నగరంలో అంబులెన్స్ మాఫియా రాజ్య మేలుతుంది. ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి చేర్చాలన్న, మృతి చెందిన వారి మృతదేహాన్ని ఇంటికి చేర్చాలన్న ప్రతిఒక్కరూ అంబులెన్స్ పై ఆధారపడతారు. ప్రజల అవసరాలను పావుగా వాడుకొని, అంబులెన్స్ మాఫియా రాబందుల్లా తయారైనది. గత ప్రభుత్వ హయాంలోని రాజకీయ నాయకుల మద్దతుతో ఈ మాఫియా విషనాగుగా తయారై ప్రజల నిస్సాహాయతపై కాటు వేస్తున్నారు. శవాల మీదా డబ్బులు ఏరుకోవడం అంటే ఏమిటో అప్పటి వైసిపీ ప్రభుత్వం హయాంలో ప్రజలు ప్రత్యక్షంగా చూసారు. ఇంత జరుగుతున్న కఠిన చర్యలు తీసుకోవాల్సిన రుయా సూపర్నంట్ అధికారులు నిమ్మకు నీరు ఎక్కినట్లు వ్యవహరిస్తున్నారు. యాక్సిడెంట్ అయిన వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని,మృతి చెందిన మృతదేహాలను, సైతం అంబులెన్స్ సహాయంతోనే గమ్యస్థానాలకు చేరుస్తారు.

మృతి చెందిన కుటుంబాలు పుట్టాడు దుఃఖంతో ఉన్న అవేమీ పట్టించుకోకుండా పైసానే పరమావధిగా భావించి వారి దగ్గర ముక్కు పిండి మరి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడినా కూడా గత ప్రభుత్వ వాసన వీడటం లేదని తిరుపతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చామంతి శ్రీనివాస్ మండిపడ్డారు.. ఈ దారుణాంపై వెంటనే చర్యలు తీసుకోవాలని . రుయా సూపర్డెంట్ ను విజ్ఞప్తి చేశారు. పేదల నుండి అధిక మొత్తంలో వసూలు చేస్తున్న సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు బిజెపి నాయకులతో కలసి వినతి పత్రం అందజేశారు

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.