తిరుపతి నగరంలో అంబులెన్స్ మాఫియా రాజ్య మేలుతుంది. ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి చేర్చాలన్న, మృతి చెందిన వారి మృతదేహాన్ని ఇంటికి చేర్చాలన్న ప్రతిఒక్కరూ అంబులెన్స్ పై ఆధారపడతారు. ప్రజల అవసరాలను పావుగా వాడుకొని, అంబులెన్స్ మాఫియా రాబందుల్లా తయారైనది. గత ప్రభుత్వ హయాంలోని రాజకీయ నాయకుల మద్దతుతో ఈ మాఫియా విషనాగుగా తయారై ప్రజల నిస్సాహాయతపై కాటు వేస్తున్నారు. శవాల మీదా డబ్బులు ఏరుకోవడం అంటే ఏమిటో అప్పటి వైసిపీ ప్రభుత్వం హయాంలో ప్రజలు ప్రత్యక్షంగా చూసారు. ఇంత జరుగుతున్న కఠిన చర్యలు తీసుకోవాల్సిన రుయా సూపర్నంట్ అధికారులు నిమ్మకు నీరు ఎక్కినట్లు వ్యవహరిస్తున్నారు. యాక్సిడెంట్ అయిన వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని,మృతి చెందిన మృతదేహాలను, సైతం అంబులెన్స్ సహాయంతోనే గమ్యస్థానాలకు చేరుస్తారు.
మృతి చెందిన కుటుంబాలు పుట్టాడు దుఃఖంతో ఉన్న అవేమీ పట్టించుకోకుండా పైసానే పరమావధిగా భావించి వారి దగ్గర ముక్కు పిండి మరి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడినా కూడా గత ప్రభుత్వ వాసన వీడటం లేదని తిరుపతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చామంతి శ్రీనివాస్ మండిపడ్డారు.. ఈ దారుణాంపై వెంటనే చర్యలు తీసుకోవాలని . రుయా సూపర్డెంట్ ను విజ్ఞప్తి చేశారు. పేదల నుండి అధిక మొత్తంలో వసూలు చేస్తున్న సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు బిజెపి నాయకులతో కలసి వినతి పత్రం అందజేశారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- గద్దర్ విగ్రహానికి భూమిపూజ నిర్వహణ.పీడిత దళిత అణగారిన కులాలకు గద్దర్ మాట పాట ఒక దిక్సూచి అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ వెన్నెల గద్దర్ అన్నారు . మెదక్ జిల్లాలో పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు ధ్యాన్ చంద్ చౌరస్తా వద్ద గద్దర్ విగ్రహ…
- సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల…సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ ట్రైలర్ విడుదల… హృదయాలను హత్తుకునే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా భారీ అంచనాలు తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. తొలి ఫ్రేమ్ నుంచే ఆహ్లాదకరమైన, భావోద్వేగభరితమైన,…
- బీఆర్ఎస్పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్యను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో…
- చేనేతకు అండగా ప్రభుత్వం : హోంమంత్రి అనిత.జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ‘నేతన్న సేవలో’ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. చేనేత కార్మికుల నుంచి చీర కొనుగోలు చేసి వారి కష్టాన్ని అభినందించిన మంత్రి, చేనేత అనేది కేవలం వృత్తి మాత్రమే…
- ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ లేఖ.దేశంలో నదుల అనుసంధానంపై మరోసారి చర్చకు దారితీసే కీలక పరిణామం చోటుచేసుకుంది. గోదావరి–కావేరి–గుండార్ నదుల అనుసంధాన ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంతో వేగవంతంగా అమలు చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. గోదావరిలో సముద్రంలో కలిసిపోతున్న…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి