Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది…

by CVR NEWS
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2025, నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్–2025 అవార్డుల్లో దేశవ్యాప్తంగా ఏపీ రెండో స్థానం సాధించడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది. ఈ విజయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తుండటమే ఈ విజయానికి కారణమన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గ్రామ పంచాయతీలకు పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

023956
Total views : 143626

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.