Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు

తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు

by Satya
తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు

ప్రజల కోసం తాను జీవితాంతం పని చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాధితుల బాధలను చూసి, కష్టాలు విని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వర్షాలు, గత పాలకుల పాపాలు ఇప్పుడు ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ యుద్ధం ముగిస్తే.. ఇక రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టి పెడతామన్నారు. తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు. 9 రోజుల్లో విజయవాడ నగరాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చామన్నారు. సింగ్‌నగర్‌లో వరద వచ్చిన తొలి రోజు తాను పర్యటించినప్పటికీ, ఇప్పటి పరిస్థితుల్లో చాలా పురోగతి కన్పించిందన్నారు. తొలి రోజు ప్రజలు చాలా బాధగా ఉండటం చూశానని, 9వ రోజు తమ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న పూర్తి నమ్మకం చూశానని తెలిపారు. ప్రజలు సర్వస్వం కోల్పోయారని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
    క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
  • చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..
    నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
  • తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
    తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్‌ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
  • విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
    విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
  • తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..
    తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్‌ సృష్టించిన సీఎం విజయ్‌..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014092
Total views : 78954

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.