విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి ఉధ్రిక్తత పరిస్థితి నెలకొంది. గడ్డి మందు తాగిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నందిగామ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వైద్యం చేస్తుండగా వ్యక్తి మృతిచెందాడు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే చనిపోయారంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వైద్యులపై దాడికి యత్నించారు. డ్యూటీలో ఉన్న వైద్యులపై బూతులతో కొందరు యువకులు రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా దాడి చేయబోగా నర్సులు అడ్డుకున్నారు. ఆస్పత్రిలో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న సీఐ గుణరామ్ పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలకు సర్దిచెప్పిన పోలీసులు ఫిర్యాదులు తీసుకున్నారు.కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ల సమ్మె. ఈ దాడి ఘటనకు నిరసనగా ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి నుంచి జూనియర్ డాక్లర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేయడాన్ని జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. క్యాజువాలిటీలో సరైన సౌకర్యాలు లేకపోతే మేము ఏం చేస్తామని జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. సూపర్ ఇండిట్ వెంకటేశ్వరరావు ఏసీబీ భాస్కరరావు తో వైద్య విద్యార్థుల చర్చలు జరుపుతున్నారు. ఎమర్జెన్సీ కేసులు యధాతధంగా కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు చెప్పారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
- చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్గా మూవీ గ్రాండ్ రిలీజ్..నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్..తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్ సృష్టించిన సీఎం విజయ్..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 78943