నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఓటర్ల చైతన్యం మరోసారి స్పష్టంగా కనిపించిందన్నారు. పాలన నచ్చితే ప్రజలు మళ్లీ గెలిపిస్తారని, నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారని ఈ ఫలితాలు చెబుతున్నాయని వ్యాఖ్యానించారు.తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని తెలిపారు. అస్సాం, పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకున్న బీజేపీ.. పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును గెలుచుకుందని పేర్కొన్నారు. ఈ విజయానికి పార్టీ అగ్రనాయకత్వం అకుంఠిత దీక్ష కారణమని కొనియాడారు.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత కొన్ని సంవత్సరాలుగా చేసిన కృషి ఫలితమే ఈ విజయమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సహా నాయకత్వానికి అభినందనలు తెలిపారు.ఇక తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మెజారిటీ రావడం విశేషమన్నారు. పార్టీ స్థాపించిన తక్కువ కాలంలోనే విజయ్ సాధించిన ఈ విజయాన్ని అభినందించారు. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి కూడా బలమైన పోరాటం ఇచ్చిందని పేర్కొన్నారు.






Total views : 75444