కాపు ఉద్యమ నేత వంగవీటి మోహన్ రంగా 35 వ వర్ధంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం లోని 12వ వార్డు పార్కు రోడ్డు లోని మున్సిపల్ కాంప్లెక్స్ నందు వైఎస్సార్సీపీ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు పాల్గొని వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా ఒక కులానికి నాయకుడు కాదని పేద బడుగు బలహీనవర్గాలకు నాయకుడు అని పేదల కోసం ఆయన చేసిన సేవలు వర్ణించలేని వని అన్నారు. నేటి యువత వంగవీటి ని ఆదర్శంగా తీసుకుని జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు చిట్టూరి కృష్ణ, వై.కే. యస్, పులపర్తి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
35th death anniversary of Vangaveeti Mohan Ranga
పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి సందర్భంగా రంగ చిత్ర పటానికి, విగ్రహాలకు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగాను హతమార్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అందుకే టిడిపిని దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని ఆయన అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఎన్నోసార్లు టిడిపి ప్రభుత్వం రంగాను చంపిందని చంద్ర బాబే చంపాడన్నారు. చంద్రబాబు నన్ను కూడా చంపాలని చూసాడు కాని నన్ను చంపలేకపోయాడని నారాయణ అప్పట్లో అన్నారు. పదవే శాశ్వతమా, పదవి కోసం పాకులాడాలా, పదవి కోసం పాకులాడే వారిని ఈ సమాజం క్షమించకూడదని కన్నాని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజశేఖర్ రెడ్డి వెంబడి నడిచాను ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంబడే నడిచాను అని అన్నారు. ఆరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా ఊహించారా. జగన్ ను జైల్లో పెడతానన్నారు అలాగే నన్ను కూడా జైల్లో పెడతారు అన్నారు. సిబిఐ కూడా నన్ను పిలిచింది అయినా నేను నమ్ముకున్న మనిషి కోసం సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నాను.






Total views : 75411