హైదరాబాద్లో జరుగుతున్న బయో ఆసియా 2024 సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ను లైఫ్ సైన్సెస్కు రాజధానిగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. త్వరలో జీనోమ్ వ్యాలీ ఫేజ్-2ని కూడా ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. ఇప్పటికే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో పాల్గొని రాష్ట్రానికి 40 వేల కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 500లకు సిలిండర్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 89724