cricket
(IND vs SA) ప్రతీ ఆటగాడు మంచి ఫామ్ లో ఉన్నాడు- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది.
ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాపై 243 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో అతను సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు.
అయితే, కోహ్లీ సెంచరీ కంటే రోహిత్ శర్మ చేసిన 40 పరుగులే కీలక పాత్ర పోషించాయి. ఒకరకంగా చెప్పాలంటే కోహ్లీ సెంచరీని అధిగమించేలా ఉంది రోహిత్ స్వల్ప ఇన్నింగ్స్.
ఈ విజయంతో భారత్ వన్డే ప్రపంచ కప్లో అజేయంగా వరుసగా ఎనిమిదో మ్యాచ్లో గెలిచింది.
ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
భారత క్రికెట్ జట్టు ఈ విజయాన్ని కొనసాగిస్తూ ప్రపంచ కప్ను గెలుచుకోవాలని ఆశిద్దాం.
మాజీ క్రికెటర్ వి వి ఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఈరోజు ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనం ఆనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి ఆలయంకు ఒక్క రోజు అలంకరణకు అయ్యే ఖర్చును వివిఎస్.లక్ష్మణ్ విరాళంగా అందించారు.దాదాపు 14 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చిన ఆయన, శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం మొదలుకుని శ్రీవారి గర్భాలయం వరకూ టిటిడి ఉద్యానవనం సిబ్బంది వివిధ రకాల అలంకరణను ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు.





Total views : 90047