గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఫార్ములా ఈ-రేస్ రద్దుతో రాష్ట్రానికి నష్టం జరిగిందని వస్తున్న విమర్శలపై స్పందించారు. రేస్ టికెట్లు అమ్ముకుని ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ లబ్ధిపొందిందన్నారు. బిజినెన్స్ రూల్స్ ప్రకారం రేస్కు అనుమతి లేదన్నారు. ఈ రేస్తో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం రాదు. దీని కోసం ప్రభుత్వం 110 కోట్లు ఖర్చు చేయాలా అని ఆయన ప్రశ్నించారు.
Formula-E race
హైదరాబాద్ లో వచ్చే నెల జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు రద్దయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్లే రేసును రద్దు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. రేసు రద్దుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయమని ఆయన అన్నారు. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్ లు హైదరాబాద్ తో పాటు దేశం బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతాయని చెప్పారు. ఇండియాకు ఈ-ప్రిక్స్ ని తీసుకురావడానికి తాము ఎంతో కృషి చేశామని, చాలా సమయాన్ని వెచ్చించామని తెలిపారు. హైదరాబాద్ ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తిదారులు, స్టార్టప్ లు హైదరాబాద్ ను పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా గుర్తించాయని తెలిపారు. ఇందులో భాగంగానే తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని అన్నారు.
Read Also..





Total views : 149330