సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ జై భారత్ నేషనల్ పార్టీ పై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ లక్ష్మీ నారాయణ ఆర్ఎస్ఎస్ మద్దతుదారుడన్నారు. జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా పార్టీని, షర్మిల వైఎస్సాఆర్టీపీ పార్టీని మూసేశారన్నారు. ఆయన కూడా త్వరలోనే పార్టీ మూసేస్తారన్నారు. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్లు తన పార్టీలో చేరారన్నారు. ఇది ఒక చీకటి రోజుగా తాను గుర్తిస్తున్నానన్నారు. మాజీ జేడీ పార్టీ పెట్టేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ 1000 కోట్ల రూపాయలు సమకూర్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలనుకునే వాళ్లను రూ.50 కోట్లు అడుగుతున్నారన్నారు.
Read Also..
Read Also..





Total views : 62241