డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం, మురమళ్ల కార్తీక మాసం అమావాస్య మహా పర్వదినం పురస్కరించుకుని మురమళ్లశ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం వారి ఆలయంలో దీపోత్సవ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా మంగళవారం జరిగింది. భక్తులు వెలిగించిన దీపాళ కాంతులతో ఆలయం కళకళలాడింది. కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మిడివరం ఎంఎల్ఏ పొన్నాడ సతీష్ కుమార్, ఆలయం కమిటీ చైర్మన్ వాసురాజు లతో పాటు పలువురు నాయకులు.ఆలయంలో ప్రత్యేక పూజలు… ఆకర్షనీయంగా నిలిచిన మంచుకొండల నడుమ శివలింగం సెంటింగ్. ముమ్మిడివరం శాసన సభ్యులు శ్రీ పొన్నాడ వెంకట సతీష్.కుమార్, చైర్మన్ శ్రీ పెన్మత్స వాసురాజు దంపతులు, కార్యనిర్వాహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. తొలుత పార్థీవ లింగానికి ఆలయ అర్చకులు , పురోహితులు ఆధ్వర్యంలో అభిషేకం ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ఆవరణ చుట్టూ దేవతా మూర్తుల ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ వెలుపల, బయట దీపాలంకరణ తో ఆలయం కళకళలాడింది. మండల నలుమూలల నుండి భక్తులు దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయం పచ్చి పూల అలంకరణ తో సర్వాంగసుందరంగా అలంకరించారు.సత్యసాయి సేవా ట్రస్ట్ సేవకులు, సమరసత సేవ ట్రస్ట్ నుండి విశేషసేవలందించారు. కార్యనిర్వాహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, సర్పంచ్ కాలే రాజబాబు, పెన్మత్స చిట్టిరాజు, మాజీ చైర్మన్ లు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.
kartik month festivals
అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు, అంగరంగ వైభవంగా కార్తీక మాస వేడుకలు. దీపావళి అనంతరం దీపావళి మరుసటి రోజు నుండి కార్తీక మాసం మొదలవుతుంది అనే విషయం అందరికీ తెలిసినదే ఇందులో భాగంగానే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని హిందువులు ప్రతిరోజు శివుని ఆలయానికి వెళ్లి దీపారాధనలు చేసి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ప్రత్యేకించి కార్తీక మాసంలో ప్రతి సోమవారం శివునికి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలలో దీపాలతో దీపారాధన చేస్తారు. కొంతమంది 365 దీపాలతో మరి కొంతమంది లక్ష దీపాలతో దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటారు. ఈ కార్తీకమాసంలోనే హిందువులు వనభోజనాలకు వెళ్లి సరదాగా సంబరాలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే రైల్వేకోడూరు పట్టణంలో నడిబొడ్డున వెలసి ఉన్న భుజంగేశ్వర స్వామి ఆలయంలో రైల్వే కోడూరు ఉపసర్పంచ్ తోట శివ సాయి సహకారంతో భుజంగేశ్వర ఆలయ చైర్మన్ పోకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కార్తీకమాసం మొదటి రోజు నుండి నేటి వరకు అనగా నెల రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో వేలాదిమంది భక్తులతో లక్షలాది దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేసి ప్రజలు తమ భక్తుని చాటుకున్నారు. ప్రత్యేకించి సోమవారాలలో అంగరంగ వైభవంగా పూజలు, అన్నదానాలు, భజన కార్యక్రమాలు, దీపారాధనలతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. భుజంకేశ్వర ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలతో సుందరీకరంగా అలంకరించారు. నాలుగవ కార్తిక సోమవారం నాడు మిచౌంగ్ తుఫాన్ సైతం లెక్కచేయకుండా జోరు వానలో హోరుగా అన్నదానాలు, భజన కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణమంతా భక్తులు పోటెత్తిపోయారు. కార్తీక మాసం పూలు పండ్లు, కాయ కర్పూరం లాంటి చిరు దుకాణాల వ్యాపారులకు కనక వర్షం కురిపించింది. ఏది ఏమైనప్పటికీ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో భుజంగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తిపోయారు. చివరి వారం కావడంతో ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు తమ సతీమణి భుజంగేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది రైల్వే కోడూరు ప్రజలు, వర్తకులు, రైతులు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ దేవుని ప్రార్థించాలని కొరముట్ల శ్రీనివాసులు తమ సతీమణి తెలియజేశారు.





Total views : 62217