మరోవైపు వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న LDF కూటమికి ఈసారి ఎదురుదెబ్బ తగలనుంది. కేరళ ఓటర్లు మళ్లీ మార్పు కోరుకుంటున్నట్లు పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 75-85 స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకోనుంది. పినరయ్ విజయన్ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి ఉన్నప్పటికీ, అధికారాన్ని మార్చే సంప్రదాయానికే ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని సర్వే సంస్థలు అంచనా వేశాయి.
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పుదుచ్చేరిలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి తన అధికారాన్ని సునాయాసంగా నిలబెట్టుకోబోతోందని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నాయకత్వంపై ప్రజలు మరోసారి నమ్మకం ఉంచినట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్-డీఎంకే కూటమి ఈ రేసులో చాలా వెనుకబడి పోయిందని విశ్లేషణలు చెబుతున్నాయి.





Total views : 61464