Tdp
కోర్టు నిబంధనల మేరకు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వరకూ చంద్రబాబు కాన్వాయ్ సాగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. బాబుకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు చేస్తే ప్రభుత్వ సలహాదారు రామకృష్ణా రెడ్డి, వైసీపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ఛీకొడుతున్నా వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ రావటానికి చంద్రబాబుకు 16 గంటల సమయం పట్టింది. కోర్టు నిబంధనలు లేకపోతే ఇప్పుడు వచ్చినదానికంటే నాలుగు రెట్లు అధికంగా జనం వచ్చేవారు. చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించకుండా కారులోనే ఉండి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. లోకేశ్ ఢిల్లీ వెళితే వైసీపీ వాళ్లకెందుకు ఉలికిపాటు. అక్రమ కేసులో చంద్రబాబును 52 రోజులు నిర్బంధించారు. ఆయన అవినీతికి పాల్పడ్డట్టు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ అవకతవకలు జరిగాయంటూర మరో కొత్త కేసు పెట్టారు. వైసీపీ వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏమీ చేయలేరు’’ అని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కండిషన్స్పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. సీఐడీ పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా… చంద్రబాబు తరపు న్యాయవాదాలు కౌంటర్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. నవంబర్ 3న ఆర్డర్స్ ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, ఉండవల్లి నివాసం నుండి గన్నవరం విమానాశ్రయం కి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కి వెళ్ళనున్నారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ కి మాజీ మంత్రి దేవినేని ఉమా, గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్లో భారీగా మోహరించిన పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. ‘సంస్థాగతంగా బీజేపీని ఫణంగా పెట్టి మీ సామాజికవర్గ కుటుంబ పార్టీ అయిన టీడీపీ బలోపేతం కోసం తపిస్తున్నావని ఢిల్లీ పెద్దలకూ తెలుసులేమ్మా పురందేశ్వరి. ఇసుకను గతంలో దోచుకునేవారు. ఇప్పుడు సహజవనరుల దోపిడీ తగ్గి ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తోందని తెలుసుకోమ్మా. గాలి బుడగలా ఎగురుతూ, ఇష్టానుసారం మాట్లాడుతున్నావే చెల్లెమ్మా!’ అని ట్వీట్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకి బెయిల్ రావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు గారి విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయనను స్వాగతిద్దాం అని జనసేన అధినేత ట్వీట్ చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకునే క్రమంలో అడుగడుగునా నీరాజనాలు పలికారు. ముఖ్యంగా విజయవాడలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. రాత్రి 3.30 గంటల సమయంలో ఆయన కాన్వాయ్ రామవరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశించింది. అప్పటికే ఎదురుచూస్తున్న అభిమానులు ఆయనను చూడగానే ఒక్కసారిగా కేరింతలు కొడుతూ రోడ్లపైకి వచ్చారు. ‘జై చంద్రబాబు, జై తెలుగుదేశం’ అంటూ నినాదాలతో మారుమోగించారు. విజయవాడ నిర్మలా కాన్వెంట్, బెంజి సర్కిల్ పరిసరాలు జైచంద్రబాబు నినాదాలతో దద్దరిల్లాయి. కనకదుర్గ వారధి, తాడేపల్లి, ఉండవల్లి సెంటర్లలో చంద్రబాబు రాకకోసం జనం గంటల తరబడి ఎదురుచూశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా తెల్లవారుజామున సైతం విజయవాడ నగర ప్రజలు చంద్రబాబును చూసేందుకు గంటల తరబడి నిరీక్షించారు. తెల్లవారుజామున 4.45 గంటలకు విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్కు చేరుకున్న చంద్రబాబునాయుడు కాన్వాయ్కి అపూర్వస్వాగతం లభించింది. విజయవాడ నగరానికి చెందిన వేలాదిమంది మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. పెల్లుబుకిన ఆనందంతో మహిళలు హారతులు ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ, నెట్టెం రఘురామ్, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, నాగుల్ మీరా, కేశినేని చిన్ని, ఇతర ముఖ్యనేతలు అధినేతకు ఘనస్వాగతం పలికారు. కాగా మంగళవారం సాయంత్రం 4.15 గంటల సమయంలో రాజమండ్రి నుండి చంద్రబాబు బయలుదేరారు. అభిమానుల తాకిడి ప్రభావంతో ఆయన సుధీర్ఘ నిర్విరామ ప్రయాణం చేయాల్సి వచ్చింది. మధ్యంతర బెయిల్కు సంబంధించి కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు కారు లోపల నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గ వారధివైపు వెళ్లాల్సిన కాన్వాయ్ను పోలీసులు బందరురోడ్డు, ఫైర్ స్టేషన్, వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజి మీదుగా ఉండవల్లి వెళ్లేవిధంగా దారిమళ్లించారు.మధ్యంతర బెయిల్కు సంబంధించి కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు కారు లోపల నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గ వారధివైపు వెళ్లాల్సిన కాన్వాయ్ను పోలీసులు బందరురోడ్డు, ఫైర్ స్టేషన్, వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజి మీదుగా ఉండవల్లి వెళ్లేవిధంగా దారిమళ్లించారు.
బందరు రోడ్డు వైపు కాన్వాయ్ మళ్లించిన పోలీసులు తెల్లవారుజామున 4.45గంటలకు విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్ కు చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్. విజయవాడ నగరానికి చెందిన వేలాదిమంది మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబును చూడగానే మహిళల్లో పెల్లుబికిన ఆనందం, హారతులు పడుతూ నీరాజనాలు చేసారు . ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దే అనూరాధ, నెట్టెం రఘురామ్, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, నాగుల్ మీరా, కేశినేని చిన్ని, ఇతర ముఖ్యనేతలు అధినేతకు స్వాగతం పలికారు. కారులోపల నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ బాబు ముందుకు సాగారు.
Read Also..
కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోకి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కాన్వాయ్. కలపర్రు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపైకి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు. చంద్రబాబును చూడనీయకపోతే కాన్వాయ్ ని కదలనీయబోమంటూ అడ్డుపడుతున్న ప్రజలు. రాత్రి 11.30గంటల ప్రాంతంలోనూ జాతీయరహదారిపై వేచిచూస్తున్న మహిళలు, అభిమానులు. రాజమండ్రి నుంచి 7గంటలకు పైగా సాగుతున్న చంద్రబాబునాయుడు ప్రయాణం. భారీగా తరలివస్తున్న ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో జాతీయరహదారిపై గంటకు 20కిలోమీటర్లు కూడా సాగని కాన్వాయ్. వేలాదిగా తరలివస్తున్న ప్రజలను అదుపుచేయలేక ఆపసోపాలు పడుతున్న పోలీసులు.
విస్సన్నపేట బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు 52 రోజుల తర్వాత రిమాండ్ నుంచి షరతులతో కూడిన బెయిల్ మంజూరు అవటంతో , తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు మిఠాయిలు, బాణాసంచా కాల్చారు కమ్మటూరు రామాలయం సెంటర్లో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు చంద్రబాబు విడుదలైన సందర్భంగా బాణాసంచా కాల్చి మిఠాయిలు, పంచి సంతోషాన్ని వ్యక్తం చేసినారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాబా శ్రీను, మర్రిబోయిన చిన్నోడు, రాయల సుబ్బారావు, ఆకుల రాధా, రామినేని రామారావు, జనసేన పార్టీ నాయకులు, అడపా శ్రీను,కిషోర్, వెంకటేశ్వరరావు, యాసిన్, నాదెండ్ల నాగమణి, వాణి, కార్యకర్తలు వృద్ధులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కమ్మటూరు మొత్తం పండుగ వాతావరణ నెలకొన్నది.





Total views : 89828