ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ లేకుండా ఎవరూ ఉండడం లేదు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. దీనివల్ల అన్ని పనులు సులువుగా జరుగుతున్నాయి. అయితే చాలామంది రాత్రిపూట స్మార్ట్ఫోన్ చార్జింగ్ పెట్టి పడుకుంటున్నారు. దీనివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. చార్జింగ్ ఎప్పుడైనా కొంత సమయం వరకే చేయాలి. లేదంటే ఫోన్ ఆయుష్షు తగ్గుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం స్మార్ట్ఫోన్లలో అధిక ఛార్జింగ్ను నిరోధించే అదనపు రక్షణ చిప్లు ఉన్నాయి. ఈ చిప్స్ వల్ల బ్యాటరీ 100% ఛార్జ్ అయిన వెంటనే ఛార్జింగ్ ఆగిపోతుంది. అయితే రాత్రిపూట ఫోన్ను ఛార్జింగ్లో ఉంచినట్లయితే బ్యాటరీ 99%కి వచ్చిన వెంటనే మళ్లీ ఛార్జింగ్ ప్రారంభమవుతుంది. ఇది బ్యాటరీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఫోన్ తొందరలోనే పాడవుతుంది. మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండాలంటే రాత్రిపూట ఛార్జింగ్లో ఉంచవద్దు. బదులుగా దానిని 80% నుంచి 90% వరకు ఛార్జ్ చేసి ఆపై దాన్ని అన్ప్లగ్ చేయాలి. దీనివల్ల బ్యాటరీ సామర్థ్యం పెరగడంతో పాటు ఫోన్ జీవితకాలం ఎక్కువ ఉంటుంది. ఫోన్ని పదే పదే ఛార్జ్ చేస్తుంటే పరికరం వేడెక్కుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఛార్జింగ్ చేసేటప్పుడు కవర్ తొలగించాలి. ఫోన్ను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు దానిపై ఎలాంటి బరువైన వస్తువు ఉండకూడదని గుర్తుంచుకోండి. ఫోన్ని దిండు కింద పెట్టుకుని కూడా ఛార్జింగ్ పెట్టవద్దు.
technology news
డిసెంబర్ 1 నుండి New SIM Card Rules మొదలు..ఫాలో అవ్వకపోతే 10 లక్షలు ఫైన్.!
డిసెంబర్ 1 నుండి New SIM Card Rules అమలులోకి తీసుకు వస్తోంది. కొత్త రూల్స్ అమలు కావడానికి కేవలం ఒక రోజు మాత్రమే గడువు భారత ప్రభుత్వం డిసెంబర్ 1 నుండి కొత్త సిమ్ కార్డ్ అమలులోకి తీసుకు వస్తోంది. ఈ కొత్త రూల్స్ ను ఫాలో చేయ్యని వారికి 10 లక్షలు ఫైన్ ను కూడా విదిస్తుంది. అంటే, కొత్త రూల్స్ అమలు కావడానికి కేవలం ఒక రోజు మాత్రమే గడువు వుంది. అందుకే, మొబైల్ యూజర్లు, ప్రభుత్వం అమలు చేయనున్న ఈ కొత్త సిమ్ కార్డ్ రూల్స్ ను గతంలో సిమ్ కార్డ్ తీసుకోవడం చాలా సులభమైన పద్డతి. అయితే, సిమ్ కార్డ్ లను ఎటువంటి పారదర్శకత లేకుండా అడ్డగోలుగా అమ్ముడు చేశారు కొంత మంది సిమ్ కార్డ్ విక్రయదారులు. అయితే, సిమ్ కార్డు యూజర్ వెరిఫికేషన్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ను ఉపయోగించిన తరువాత చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాపంగా ఒకే ఫోటో మరియు వివరాలతో వేలల్లో సిమ్ కార్డ్ లను లోకల్ సిమ్ కార్డ్ విక్రయదారులు విక్రయించి నట్లు బయటపడింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ కొత్త సిమ్ కార్డ్ రూల్స్ ను తీసుకు వచ్చింది. వాస్తవానికి, 2023 అక్టోబర్ 1 నుండే అమలులోకి రావాల్సి ఉండగా, ప్రభుత్వం కొత్త సిమ్ కార్డ్ రూల్స్ కోసం రెండు నెలల గడువును విధించింది. ఈ రోజుతో గడువు ముగుస్తుంది మరియు డిసెంబర్ 1 నుండి కొత్త రూల్స్ అమలవుతాయి. ఏమిటి ఈ సిమ్ కార్డ్ రూల్స్? ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త సిమ్ రూల్స్ ప్రకారం, సిమ్ విక్రయదారులు అందరూ కూడా వారి పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయించు కోవాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ రిజిస్ట్రేషన్ కోసం వారి వివరాలను మరియు ఐడెంటిటీని పోలీసులు కూడా నిర్ధారించ వలసి ఉంటుంది. ఆ తరువాతే ఆ విక్రయదారులు పూర్తి వెరిఫికేషన్ భాద్యత అంతా కూడా ఆ టెలికం ఆపరేటర్ దే అవుతుంది. ఈ వెరిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ ప్రోసెస్ మొత్తం కూడా ఈ రోజు లోపుగా పూర్తి చేయవలసి ఉంటుంది. డిసెంబర్ 1 నాటికి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయని విక్రయదారులకు 10 లక్షల వరకూ జరిమానాను విదిస్తుంది DoT.
భారతదేశం చేపట్టిన మొదటి సోలార్ మిషన్ ఆదిత్య L1 తాజాగా దాని చివరి గమ్యస్థానానికి చేరుకుంది. 2023, సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక 2024, జనవరి 7 నాటికి లాగ్రాంజియన్ పాయింట్ ఎల్1 చుట్టూ హాలో కక్ష్యలోకి ప్రవేశిస్తుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తోంది. సూర్యుడిని అధ్యయనం చేయడానికి భారతదేశం చేపట్టిన మొదటి సోలార్ మిషన్ ఆదిత్య L1 తాజాగా దాని చివరి గమ్యస్థానానికి చేరుకుంది. 2023, సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక 2024, జనవరి 7 నాటికి లాగ్రాంజియన్ పాయింట్ ఎల్1 చుట్టూ హాలో కక్ష్యలోకి ప్రవేశిస్తుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. భూమి, సూర్యుని గురుత్వాకర్షణ శక్తులు ఒకదానికొకటి సమతుల్యం చేసుకునే ప్రదేశంలో లాగ్రాంజియన్ పాయింట్ L1 అనేది ఒక ప్రత్యేక ప్రదేశం. ఇది భూమి నుంచి సూర్యుని దిశలో దాదాపు 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉంటుంది. ఆదిత్య L1 ఈ పాయింట్ చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా భూమి లేదా చంద్రుడి నుంచి ఎటువంటి అంతరాయం లేకుండా సూర్యుడిని నిరంతరం గమనించగలుగుతుంది. ఆదిత్య L1 సన్ మాగ్నెటిక్ ఫీల్డ్, సోలార్ విండో, కరోనా, మంటలు, క్రోమోస్పియర్ వంటి వివిధ అంశాలను అధ్యయనం చేయడానికి ఏడు సైంటిఫిక్ ఇన్స్ట్రమెంట్స్తో పనిచేస్తుంది. ఈ ఇన్స్ట్రమెంట్స్ నాలుగు వేర్వేరు వేవ్లెంత్స్లో సూర్యుని చిత్రాలను, వర్ణపటాల ను క్యాప్చర్ చేస్తాయి, మిగిలిన మూడు స్పేస్క్రాఫ్ట్ చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణంలోని ప్లాస్మా, మాగ్నెటిక్ ప్రాపర్టీస్ కొలుస్తాయి.
గూగుల్ మ్యాప్స్ ఈ నెలలో కొన్ని ప్రధాన అప్డేట్లను తీసుకొచ్చింది. కొత్త AI ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ATM లొకేషన్లు, ఇతర సంస్థల వంటి స్థలాలపై తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్స్ కు వెళ్తుంటారు. అయితే ఒక్కోసారి తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది. మ్యాప్స్ను మరింత పటిష్టంగా మార్చే ప్రయత్నంలో Google ఇప్పుడు మూడు కొత్త మార్గాలను షేర్ చేసింది. బుధవారం భాగస్వామ్యం చేసిన బ్లాగ్ పోస్ట్లో వినియోగదారు అందించిన కంటెంట్లో అసాధారణమైన నమూనాలను పర్యవేక్షిస్తుంది. ఉదాహరణకు వన్-స్టార్ రివ్యూలలో పెరుగుదల, దుర్వినియోగాన్ని నిరోధించడానికి తగిన చర్య తీసుకుంటుందని Google వివరించింది. “విధానాన్ని ఉల్లంఘించే కంటెంట్ను తీసివేయడం నుంచి కొత్త సహకారాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం వరకు ఇది ప్రతిదీ కలిగి ఉంటుంది” అని బ్లాగ్ లో పేర్కొంది. కంపెనీ పాలసీని ఉల్లంఘించే సమీక్షలను కూడా చూస్తుందని వివరించింది. శోధన ఇంజిన్ దిగ్గజం సహాయక మరియు హానికరమైన వినియోగదారు సహకారాలకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక పరిష్కాలను ఏర్పాటు చేసింది. గత నెలలో, Google కొత్త మ్యాప్స్ అప్డేట్లో భాగంగా రూట్ల ఫీచర్ కోసం లీనమయ్యే వీక్షణను రూపొందించింది. ఇది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నడిచేటప్పుడు లేదా సైక్లింగ్ చేస్తున్నప్పుడు దశల వారీగా వారి మార్గాన్ని ప్రివ్యూ చేయడానికి వినియోగదారులకు ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ ఈ ఫీచర్ ఆమ్స్టర్డామ్, బార్సిలోనా, డబ్లిన్, ఫ్లోరెన్స్, లాస్ వెగాస్, లండన్, లాస్ ఏంజిల్స్, మయామి, న్యూయార్క్, పారిస్, శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ జోస్, సీటెల్, టోక్యో మరియు వెనిస్ వంటి ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులో ఉంది. అదనంగా, వినియోగదారులు తమ పరిసరాలను నిజ సమయంలో అర్థం చేసుకోవడంలో సహాయపడేందుకు Google మ్యాప్స్ ఫీచర్లో AI- పవర్డ్ లెన్స్ను కూడా అందుబాటులోకి తెచ్చింది.
Read Also..
ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధనలు చేపట్టారు. ఒక దశాబ్ధం ముందే గుండెపోటు రిస్క్ని గుర్తించవచ్చని అధ్యయనంలో వెల్లడైంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో భాగంగా పరిశోధకులు. యూకేలోని 8 ఆస్పత్రుల్లోని 40,000 మంది సాధారణ కార్డియాక్ సీటీ స్కాన్ డేటాను విశ్లేషించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. అన్ని రంగాల్లో కృత్రిమ మేథ వినియోగం అనివార్యంగా మారింది. చివరికి వైద్య రంగంలోనూ ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీంతో ఊహకందని ఎన్నో అద్భుతాలకు తెర తీస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పదేళ్ల ముందుగానే గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని సుమారు మూడేళ్ల పాటు పరిశోధించారు. హృదయ ధమనిలో పూడికతో సంకుచితంగా ఉన్నవారు తీవ్రమైన గుండెపోటు వచ్చే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. పరిశోధనల్లో భాగంగా ఏఐని ఉపయోగించి ధమనులు, దాని చుట్టూ ఉన్న కోవ్వులో మార్పులపై సమాచారాన్ని అలాగే ధమనుల్లో రక్తమార్గం సన్నగా ఉండటాన్ని గుర్తించేలా ఏఐ టూల్కి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ టెక్నాలజీ గుండె సంబంధిత ప్రమాదాలను కచ్చితంగా అంచనా వేయగలదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయమై పరిశోధకులు మాట్లాడుతూ. ‘ధమనుల్లో ఎలాంటి అడ్డంకుటు లేనివారిలో, వారి రక్తనాళాల్లో వాపు తక్కువగా ఉన్నవారితో పోలిస్తే ఇతరుల్లో గుండె సంబంధిత మరణాలు 10 రెట్లు ప్రమాదం ఎక్కువగా ఉంద’ని తెలిపారు. పరిశోధనల్లో భాగంగా 744 మంది రోగులకు సంబంధించి ఏఐ రూపొందించిన రిస్క్ స్కోర్ వైద్యులకు అందించింది. ఛాతీనొప్పితో బాధపడుతున్న రోగుల వివరాలను అందించడం ద్వారా గుండెపోటును ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు.
ఈ కొత్త టూల్ మ్యూజిక్ వీడియోలను క్రియేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ వన్ ప్లస్ కొత్త OnePlus AI Music Studio ను మ్యూజిక్ ప్రియుల కోసం తీసుకు వచ్చింది. ఎందుకంటే, ఈ కొత్త వన్ ప్లస్ AI మ్యూజిక్ స్టూడియో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి AI ఆధారిత బీట్స్ ను క్రియేట్ చేస్తుంది. అంతేకాదు, మీరు క్రియేట్ చేసిన మ్యూజిక్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు వన్ ప్లస్ కాంటెస్ట్ కోసం కూడా పంపించవచ్చు. అసలు ఏమిటి ఈ OnePlus AI Music Studio వన్ ప్లస్ AI మ్యూజిక్ స్టూడియో అనేది వన్ ప్లస్ కొత్తగా తీసుకు వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మ్యూజిక్ ప్లాట్ ఫామ్. ఇందులో చాలా సింపుల్ గా లిరిక్స్ మరియు దానికి తగిన బీట్స్ తో AI మ్యూజిక్ వీడియోను క్రియేట్ చేయవచ్చు. వన్ ప్లస్ AI మ్యూజిక్ స్టూడియోలో వీడియో ఎలా క్రియేట్ చేయడం చాలా సింపుల్. దీనికోసం ముందుగా మీరు ఇందులో అకౌంట్ క్రియేట్ చెయ్యాలి. ఇందుకోసం, aimusicstudio.oneplus.in సైట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ మీ Sign In పైన క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి సబ్ మీట్ చెయ్యాలి. మీకు ఒక OTP అందుకుంటుంది మరియు దాన్ని ఎంటర్ చేయడం ద్వారా మీరు లాగిన్ అవ్వవచ్చు. ఇక్కడ SignUP పైన క్లిక్ చేసి అకౌంట్ ను క్రియేట్ చేయవచ్చు. సైన్ అప్ పైన క్లిక్ చేయగానే కొత్త పేజ్ లో మీ పేరు మరియు ఇమెయిల్ అడ్రెస్ వివరాలను అందించాలి. మీఋ అందించిన ఇమెయిల్ అడ్రెస్ కు OTP అందుతుంది. ఈ OTP ని ఎంటర్ చెయ్యగానే మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది. లాగిన్ అయిన తరువాత, Create Music ద్వారా కొత్త మ్యూజిక్ క్రియేట్ కోసం ముందు సాగవచ్చు. ఇక్కడ మీకు నచ్చిన genre, mood మరియు theme లను ఎంచుకోండి మరియు అడిగిన బాక్స్ లో మీ లిరిక్స్ కోసం ప్రాంప్ట్ ను అందించండి. అంతే, అడుగున ఉన్న proceed బటన్ ను నొక్కగానే ‘Generated Lyrics based on your choices’ అని మీ మ్యూజిక్ కోసం లిరిక్స్ ను అందిస్తుంది. మీ పైన చూపిన లిరిక్స్ నచినట్లయితే క్రింద ఉన్న proceed బటన్ ను నొక్కగానే మీ మ్యూజిక్ వీడియో రెడీ అయిపోతుంది. మీరు ఈ వీడియోను Publish కూడా చేసే వీలుంది మరియు డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ కొత్త టూల్ లాంచ్ సందర్భంగా కాంటెస్ట్ ను కూడా వన్ ప్లస్ నిర్వహిస్తోంది.
తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన ఫోటోస్ కోసం ఇంటర్నల్ అల్గారిథమ్లతో అమర్చబడి ఈ USB వెబ్క్యామ్ ఉందని రిలయన్స్ జియో పేర్కొంది. ఈ వెబ్క్యామ్ ని JioTVCalling అండ్ JioMeet అప్లికేషన్లతో ఉపయోగించవచ్చు. ఇంకా మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ మొదలైన ఇతర ప్రముఖ అప్లికేషన్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. రిలయన్స్ జియో కస్టమర్లు టీవీ నుండి నేరుగా వీడియో కాల్స్ చేయడానికి JioTVCamera అనే USB వెబ్క్యామ్ని ఉపయోగించవచ్చు. Jio USB వెబ్క్యామ్ లాంగ్ -రేంజ్ ఆడియోతో పాటు అల్ట్రా-వైడ్ HD వీడియోను అందిస్తుంది. ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ కోసం ప్రైవసీ షట్టర్తో కూడా వస్తుంది.
లావా బ్లేజ్ 2 5G భారతదేశంలో లాంచ్ అయ్యింది. ఇది కంపెనీ తాజా బడ్జెట్ 5G ఫోన్. కంపెనీ లావా బ్లేజ్ 2 5Gని గత సంవత్సరం Blaze 5Gకి అప్గ్రేడ్గా లాంచ్ చేసింది. ఇది సెగ్మెంట్ ఫస్ట్ రింగ్ లైట్ని కలిగి ఉంది. మరి ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం. లావా బ్లేజ్ 2 5G 4GB + 64GB వేరియంట్ ధర రూ.9,999. అయితే 6GB + 128GB వేరియంట్ ధర ఇంకా వెల్లడి కాలేదు. ఇది గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్ కలర్ ఆప్షన్లలో ఇండియాలో లాంచ్ అయ్యింది. నవంబర్ 9 నుంచి ఈ ఫోన్ లావా ఇ-స్టోర్, అమెజాన్లో అందుబాటులో ఉంది. లావా బ్లేజ్ 2 5G ఫీచర్ల గురించి మాట్లాడితే, డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్ ఉన్న స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 13లో నడుస్తుంది. ఫోన్కు ఆండ్రాయిడ్ 14 అప్డేట్ కూడా వస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఇవే కాకుండా, రెండు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్తో 6.56 అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్లు) డిస్ప్లేను కలిగి ఉంది. లావా ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్తో పాటు 6GB RAMతో పనిచేస్తుంది. స్మార్ట్ఫోన్లో వర్చువల్ ర్యామ్కు కూడా సపోర్ట్ ఉంది. అందువల్ల RAMను 12GB వరకు పెంచవచ్చు. ఫొటోగ్రఫీ కోసం, ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 0.08MP సెకండరీ కెమెరా ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉంది. ఫోన్ ఇంటర్నల్ మెమరీ 128 GB, దీనిని కార్డ్ సహాయంతో 1TB వరకు విస్తరించవచ్చు. లావా బ్లేజ్ 2 5G యొక్క బ్యాటరీ 5000mAh ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ కూడా ఇచ్చారు.
టెక్ దిగ్గజం గూగుల్, తన సర్వీసెస్, ప్లాట్ఫారమ్స్ అందించే ఎక్స్పీరియన్స్ను మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో టాప్ పొజిషన్లో ఉన్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫారం యూట్యూబ్ యూజర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయడానికి కొత్త జనరేటివ్ AI ఫీచర్లను డెవలప్ చేస్తోంది. ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్లను ముందుగానే ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాన్ని సెలక్టెడ్ యూజర్లకు అందించింది. కొత్త ఫీచర్స్ బెనిఫిట్స్, యాక్సెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొత్త ఫీచర్లలో ఒకటి ఏంటంటే, ఎక్స్టెన్సివ్ కామెంట్ థ్రెడ్స్తో యూట్యూబ్ వీడియోల కామెంట్స్ కేటగరైజ్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తుంది. ఈ AI-బేస్డ్ టూల్ కామెంట్స్ని థీమ్స్ లేదా టాపిక్స్గా విభజిస్తుంది. యూజర్లు ఈజీగా డిస్కషన్స్లో పాల్గొనే సదుపాయం కల్పిస్తుంది. అంతేకాకుండా, కంటెంట్ క్రియేటర్లు ఈ కామెంట్ సమ్మరీల ద్వారా ఆడియన్స్తో సులువుగా ఎంగేజ్ కావచ్చు. కంటెంట్ కోసం ఫ్రెష్ ఇన్స్పిరేషన్ కనుగొనడానికి ఉపయోగించుకోవచ్చు.
ఢిల్లీ, ముంబై మాత్రమే కాదు.. ఇండియాలోని చాలా నగరాలు, పట్టణాల్లో గాలి కాలుష్యం బాగా పెరిగింది. ప్లాస్టిక్ కణాలు కూడా గాల్లో కలుస్తున్నాయి. దీని వల్ల ప్రజలకు ఊపిరితిత్తుల్లో సమస్యలు వస్తున్నాయి. ఆస్తమా, ఉబ్బసం వంటి వ్యాధులు వెంటాడుతున్నాయి. ఇవి వస్తే, తగ్గడం చాలా కష్టం. అందుకే ఇప్పుడు మనం ఎయిర్ ప్యూరిఫైయర్లను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మీరు కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటే.. తక్కువ ఖర్చుతో బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్లను దీనిని 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉపయోగించవచ్చు. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడుంచినా గాలిని శుభ్రం చేస్తుంది. ఇది చాలా స్టైలిష్గా, మోడ్రన్ లుక్తో ఉంది. ఇది చిన్నగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. బాగా పని చేస్తుంది.