Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Latest News పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ నేపథ్యంతో భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది

పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ నేపథ్యంతో భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది

by CVR NEWS

పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ నేపథ్యంతో భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ యుద్ధం సుమారు నెలరోజులపాటు కొనసాగవచ్చని చెప్పడంతో.. చమురు నిల్వలపై ఆందోళన మరింత పెరిగింది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు అయిపోతే ధరలు పెరుగుతాయన్న ఊహాగానాల వేళ.. ధరల పెంపుపై కేంద్రప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. చమురు, గ్యాస్ నిల్వలపై కీలక ప్రకటన చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పెంచే ఆలోచన లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో చమురు నిల్వలు 25 రోజులకు సరిపడా ఉన్నాయని, చమురు దిగుమతి కోసం ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని కేంద్రవర్గాలు తెలిపాయి. ముఖ్యంగా LNG, ఎల్ పీజీ దిగుమతుల కోసం ప్రత్యామ్నాయాలు చూస్తున్నట్లు వెల్లడించాయి.

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మూతపడింది. దీంతో వేలాది చమురు షిప్పులు సముద్రంలోనే నిలిచిపోయాయి. జలసంధి సమీపంలో వేలాది చమురు నౌకలు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నాయి. ఇవన్నీ ఎగుమతి కావాలంటే యుద్ధం ఆగాలి. అందుకు కనీసం 40 రోజులు సమయం పడుతుందని అంచనా. అక్కడి నుంచి చమురు రాకపోతే మనదగ్గరి నిల్వలు అయిపోతే ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో నెలకొన్ని ఉద్రిక్తతల నేపథ్యంలో మనవద్ద పెట్రోల్ ధరలు పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. హైదరాబాద్ లో వాహనదారులు వాహనాల్లోనే కాక.. బాటిల్స్ లోనూ పెట్రోల్ ఫిల్ చేయించుకుంటున్న దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Advertisements

You may also like

Our Visitor

014092
Total views : 78958

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.