ఆకలి సూచీలో హంగర్ ఇండెక్స్ నివేదికపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన వాఖ్యలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. 140 కోట్లమంది దేశ ప్రజల్లో 3000 మందిని పిలిచి, ఆకలేస్తుందా అని వారిని పశ్నించి ఇండెక్స్ రూపకర్తలు ఆకలి సూచీని లెక్కిస్తారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకంటే సిగ్గుచేటు ఏమీ ఉండదు. మీ మాటల్లో మీ అజ్ఞానం కనిపిస్తోంది. కొంతమందిని పిలిచి, ఆకలిగా ఉందా అని అడిగి, ఈ సూచీని సిద్ధం చేస్తారని మీరు నిజంగా భావిస్తున్నారా..? అని కాంగ్రెస్ నేత సుప్రియా ష్రినేట్ ట్వీట్ చేశారు. ఆకలిని అపహాస్యం చేయొద్దు. మీరు ఎక్కడికి వెళ్లినా తగినంత ఆహారం అందుబాటులో ఉంటుంది అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంత్రిగారు.. అహంకారానికి మరో రూపంగా ఉన్నారు ‘అంటూ శివసేన నేత ప్రియాంకా చతుర్వేది మండిపడ్డారు.
ఆకలిని అపహాస్యం చేయొద్దు
253
previous post




Total views : 89221