ప్రళయ్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం, 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే మిస్సైల్ ఇది ఒడిశా తీరంలో భారతదేశం మంగళవారం ప్రళయ్ వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన క్షిపణి త్వరలో ప్రవేశానికి సిద్ధంగా ఉంటుంది. భారతదేశం గతంలో కూడా క్షిపణి యొక్క విజయవంతమైన పరీక్షలను నిర్వహించింది. ఆ తర్వాత సైన్యంలోకి దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దీన్ని ప్రవేశపెట్టారు. తాజాగా పరీక్షించిన ప్రళయ్ ఉపరితలం నుంచి ఉపరితలంపైనున్న లక్ష్యాలను ఛేదించే స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి. సూర్యుడిపై పరిశోధనలు, భగభగమంటూ మండిపోతున్న సౌర జ్వాల ప్రళయ్ 350 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500- 1,000 కిలోల పేలోడ్ను మోసుకెళ్లగలదు. ఘన ఇంధనంతో పనిచేస్తుంది. చైనా, పాకిస్థాన్ వెంబడి సరిహద్దుల్లో మోహరించడం కోసం దీన్ని ప్రత్యేకంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రూపొందించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రయోగిస్తున్న ‘ఇస్కాండర్’ క్షిపణి తరహాలో ఇది ఉంటుంది.
భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
277
previous post





Total views : 75197