తెలంగాణలో సోమవారం నుంచి నూతన ఎలక్ట్రిక్ వెహికిల్స్ పాలసీ అమలులోకి రానుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు కొత్త పాలసీ వివరాలు ప్రకటించారు. రాష్ట్రంలో ఇకపై కొనుగోలు చేసే అన్ని ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్టు మంత్రి చెప్పారు. జీవో 41 ద్వారా తీసుకువచ్చిన ఈ కొత్త పాలసీ 2026, డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందని అన్నారు. ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఆటో, ట్రాన్స్పోర్ట్ బస్సులకు వందశాతం రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని.. దీనిద్వారా వినియోగదారులకు ఏడాదికి లక్ష రూపాయల వరకు ఆదా అవుతుందని అన్నారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ నగరం కాలుష్యం కాకూడదనే ఉద్దేశంతో ఈవీ పాలసీని ప్రవేశ పెడుతున్నామని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న మూడు వేల బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని.. త్వరలోనే సిటీలో మొత్తం ఈవీ ఆర్టీసీ బస్సులు నడుస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- అమెరికా -ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు ..ఇరాన్, అమెరికా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరస్పర దాడులతో రెండు దేశాల మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తమ ఆయిల్ ట్యాంకర్ పై దాడికి ప్రతిగా హర్మూజ్ జలసంధిలోని 3 అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేసింది.…
- పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత వివాదంగా మారింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అశోక్ నగర్…
- ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్..ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు కొనసాగుతోంది. ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లేక్ వంటి కీలక అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల…
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి ……..కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఆయనను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన ఐదవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి…
- మంచిర్యాలలో రెచ్చిపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ..చెరువు శిఖం భూమిని ఆక్రమించిన వారిని చూశాం… FTL లోకి చొచ్చుకొచ్చిన వారిని చూశాం. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏకంగా చెరువు కట్టనే మాయం చేసిన వారిని చూశారా.. అయితే మంచిర్యాల శివార్లలోని నస్పూర్ లో జరిగిన ఈ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 69934