Tuesday, April 28, 2026
News Navigation
Tuesday, April 28, 2026
News Navigation

Breaking

Tuesday, April 28, 2026
Home Crime ఛత్తీస్ ఘడ్ లో రోడ్డు ప్రమాదం…

ఛత్తీస్ ఘడ్ లో రోడ్డు ప్రమాదం…

by Prakash
Road accident in Chhattisgarh

ఛత్తీస్ ఘడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మట్టి గని వద్ద మొరం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా.. 12 మందికి పైగా గాయపడ్డారు. ఓ డిస్టిలరీ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తీసుకొస్తున్న బస్సు.. కుమ్హారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాప్రీ గామం సమీపంలో ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కకు జారి 40 అడుగుల లోతున్న గోయ్యిలో బస్సు పడింది. ఈ ఘటనలో 11 మంది అక్కడిక్కడే చనిపోగా.. నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన కార్మికుల చికిత్సకు స్థానిక అధికారులు తగిన సహాయం అందించాలని కోరారు.

Advertisements

You may also like

Our Visitor

008642
Total views : 57022

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.