308
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. ఏపీ పునర్విభజన చట్టం పేరుతో బిల్లును కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సభలో ప్రవేశపెట్టారు. ఆపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతితో చర్చ ప్రారంభమైంది. అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. చర్చలో కాంగ్రెస్ తరఫున ఎంపీ మాణిక్కం ఠాకూర్ పాల్గొన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ పేర్కొంది.