54
ఉత్తరప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉరుములు, భారీ వర్షాల మధ్య నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఆరుగురు కూలీలు సజీవ సమాధి అయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.కురారాలోని మోర్కందర్ పర్సాని నుంచి నైతి గ్రామం వరకు నిర్మిస్తున్న ఈ వంతెన వద్ద ఘటన సమయంలో పలువురు కూలీలు నిద్రిస్తున్నారు. భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుఫాను మధ్య ఒక్కసారిగా వంతెన భాగం కూలిపోవడంతో ఆరుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య 8కి చేరినట్లు అనధికారిక వర్గాలు చెబుతున్నాయి.






Total views : 89042