925
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి శాలువాతో సత్కరించారు. అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో ఉదయగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి పూజల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.