శ్రీకాకుళం జిల్లా పలాస లో సామాజిక సాధికారిక యాత్ర లో స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్ పేదరికం, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి అడ్డు రాకూడదు. నాలుగేళ్లలో పేదల కు అండగా ఉండి పథకాలు అందించడం జరిగింది. పేదవాడు నేడు తలెత్తి దైర్యం గా బతికేలా చేశాం. విద్య లో ఇంగ్లిష్ మీడియం వద్దని కొందరు కోర్టు కి వెళ్లారు. కానీ వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదువుకోవాలి పేద వారికి ఇంగ్లీష్ వద్దు అన్నారు కొందరు. పలాస లాంటి ప్రాంత వాసి కి ఇంగ్లిష్ వస్తే ఇంటర్వ్యూ దైర్యం గా ఫేస్ చేయగలరు. వైద్యం పై లక్షలు వెచ్చించి పేదలకు పైసా ఖర్చు లేకుండా చేస్తున్నాము. పిల్లలు జగన్ మామ అంటున్నారు. ఆరోగ్యశ్రీలోనే వేగంగా ఆపరేషన్లు అవుతున్నాయి. హైదరాబాద్ అయినా విజయవాడ అయినా ఆరోగ్యశ్రీ పేరున ఆపరేషన్ జరుగుతున్నాయి. పేదల ఇంటిలోకి వెళితే దేవుళ్ళుగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి వాళ్లే మా దేవుళ్ళు అంటున్నారు. రాష్ట్రంలో గతంలో సామాజిక వర్గాల్ని అట్టడుగు కు వుండేవి. జగన్ వచ్చాకే సామాజిక వర్గాలన్నీ లేచి నిలబడ్డాయి. జగన్ వల్ల సామాజిక సాధికారిక యాత్ర వల్ల మన సామాజిక విజయ శంఖారావం మ్రోగింది. ఇప్పుడు జరుగుతుంది పెత్తందారి సామాజిక వర్గాల యుద్ధం. ఈ యుద్ధంలో మనం గెలవాలి. మనం గెలవాలంటే బ్యాలెట్ యుద్ధంలో జగన్ గెలిపించాలి. ఇది మన ఆత్మగౌరవ యాత్ర మనం తలెత్తుకు తిరిగే పరిస్థితి జగన్ కల్పించారు. జగన్ బటన్ నొక్కితే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గతంలో జన్మ భూమి కమిటీ లాగ లంచాలు లేవు కుల ,, మత,పార్టీ బేధం లేదు అందరికీ అందించాం.
Srikakulam
పలాస లో సామాజిక సాధికారిక యాత్ర లో మంత్రి ధర్మాన ప్రసాదరావు కామెంట్స్ గతం లో చిన్న చిన్న మార్పులకు ఉద్యమాలు చేసే వాళ్ళం.నాలుగున్నర సంవత్సారాలు బిన్నం గా పాలన జరిగింది. కిడ్నీ డిసీజ్ పై గతం లో చూసి వెళ్ళే వారు తప్ప దానికి పరిష్కారం చూపలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక పరిష్కారం చూపి శుద్ధ జలాలు పై అడుగులు వేసాం. 700 కోట్లతో త్రాగు నీరు ప్రాజెక్ట్ నిర్మించాం, 200 పడకల ఆసుపత్రిని నిర్మించాం. గతంలో అవినీతి అనేది చాలా ఎక్కువగా ఉంది. డి బి టి ద్వారా డైరెక్ట్ గా లబ్ధిదారులకు ఇచ్చి అవినీతి అరికట్టడం జరిగింది. చంద్రబాబు కూడా మేము అరికట్టిన అవినీతి పై మాట్లాడలేక పోయారు. అందుకే చంద్రబాబు నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అంటున్నారే తప్ప అవినీతి అని చెప్పలేదు. ఆఖరుకి ఆయన కూడా ఇదే తరహా లో నిధులు పంచుతామని అన్నారంటే జగన్ లాగా బాబు ఆలోచన చేయలేకపోయారు. ప్రజల జీవన ప్రమాణాలు లు పెంచడానికి ఆయన ఆలోచించలేదు. డబ్బున్న వారి కోసం వారి నీ ఎలా మరింత పెద్దలుగా పెంచాలని ఆలోచించరే తప్ప పేదల కోసం ఏమి చేయలేదు సమాజంలో ప్రజల ప్రమాణాలు పెంచడమే లక్ష్యం తో మేము వెళుతున్నాం రోడ్లు ఉంటే నే అభివృధి అనుకోవడం తప్పు ఓక ఇంటి వారు అభివృధి చెందందంటే కారణం విద్య, వైద్యం, సొంత ఇళ్లు ఉంటే అది అభివృధి ఇల్లు లేని ప్రతి వాళ్ళకి ఇల్లు ఇచ్చాము చంద్రబాబు ఇటువంటి ఆలోచించలేదు చంద్రబాబు ఎంతసేపు రాజధాని అనుకున్నాడు. అతనికి కావలసిన ప్లేస్ లో రాజధాని మాత్రమే పెట్టుకున్నాడు. తన కావాల్సిన వాళ్ళతో రాజధాని పక్కనే భూములు కొనిపించుకున్నాడు. 2014 లో 23 సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో రెండు సంస్థలు రావాలి అందులో యూనివర్సిటీ, రీసెర్చ్ సెంటర్ గానీ రావాలి. ఒక్కటి కూడా రాలేదు ఆయన శ్రీకాకుళం అంటే ప్రేమంటారు ఎక్కడ ప్రేమ. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం చేశారు శ్రీకాకుళం ప్రాతం లో ఎన్నోసార్లు గెలిపించారు ఏమి చేయలేదు బాబు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలని చూస్తున్నారని ఇప్పుడు అంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు ఏమి చేసావు బాబు. ఇప్పుడు మోసపు మాటలు మాట్లాడుతున్నారు. 4,700 కోట్లతో మూలపెట లో పోర్ట్ వస్తోంది. ఈ ప్రాంతం అంటే జగన్ కు ప్రేమ. జగన్ సైకో అతను వస్తే ఇక్కడ దోపిడీ అంటున్నారు. మనం చూస్తున్నాం పాలన ఎలా ఉందో అర్థం చేసుకోండి. యువత ముఖ్యం గా వినాలి మనం ఏమి చేస్తున్నామో అందరికీ చెప్పాలి.
గతంలో ప్రభుత్వ స్కూల్ బాగు చేయాలని అలొచన రాలేదు. పేదలంటే చంద్రబాబు కు కొపం , చిరాకు. మత్స్యకారులకు తొక్క తీస్తాం , తోలుతీస్తామని అన్నారు. నాయిబ్రాహ్నణులకు తోకలు కట్ చెస్తామన్నారు. బిసిలు జడ్జిలుగా పనికి రారని లెటర్ రాసాడు. జడ్జిలు అవ్వాలంటే చంద్రబాబు కులం లొ పుట్టాలంట. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నారు. విద్యా , వైద్యం కార్పొరేట్ మయం చెసి బాబు తన వాళ్లకు కట్టబెట్టుకున్నారు. ఉద్దానం గోష విని , కిడ్ని జబ్బులతో చనిపోకూడదని అలోచన చెస్తున్నారు. 200 కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ హాస్పటిల్ కట్టిస్తున్నారు. 700 కొట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి కులాయి ద్వారా త్రాగు నీరు అందించే ఎర్పాటు చెస్తున్నారు.. కింజరాపు కుటుంబం జిల్లాకు ఏం చేసారో చెప్పాలి.. మూల పేటలో వలసల నిర్మూలనకు పొర్ట్ నిర్మిస్తున్నారు…
Read Also..
దర్మాన క్రిష్ణ దాస్… మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసిపి జిల్లా అద్యక్షులు 139 కులాలకు 59 కార్పోరేషన్ లు ఏర్పాటు చేసారు. జిల్లాలో రెండవ విడత సాధికార బస్సుయాత్ర నిర్వహిస్తున్నాం. బస్సు యాత్రకు ప్రజలు బహ్మరథం పడుతున్నారు. అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేసాం. పాదయాత్ర గుర్తించిన ప్రతీ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. విద్యా, వైద్యం కు ప్రదమ ప్రాధాన్యత నిచ్చారు.. దేశంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ ను నెలకొల్పుతున్నారు.. ఆర్బీకే లతో రైతులకు అన్ని విశాల సహాయ సహకారాలు అందజేస్తున్నాం. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం తో అనేక ప్రాజెక్ట్ లు వెనక బడ్డాయి. టెక్కలి లో మూడు వేల కోట్లతో పోర్టు నిర్మాణం సాగుతోంది. వాటర్ గ్రిడ్ ద్వారా ఉద్దానం కిడ్ని సమస్యకు పరిష్కారం చూపుతున్నాం. కిడ్నీ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. 4 ఏళ్లలో అనేక విప్లవాత్మక మార్పులు చెపట్టాం. వచ్చేది వైఏస్ జగన్ ప్రభుత్వమే. సర్వేలన్నీ మరలా జగన్ నే నెక్స్ట్ సిఏం అని చెపుతున్నాయి..
నా ఏస్సి, బిసి అంటూ నమ్మించి గోంతుకోస్తున్న వ్యక్తి జగన్ బస్సు యాత్ర కి నైతికత లేదు.. అది సామాజిక బస్సుయాత్ర కాదు.. జగన్ సిఏం అయ్యాక ఆరువేల మంది దళితులపై దాడి చేసారు.., హత్యలు చేసారు.. 80% దాడులు చేసింది కూడా రెడ్డి సామాజిక వర్గం వారే.. ఎమ్మెల్సీ అనంత బాబు మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే.. రాచ మర్యాదలు.. కంచికచర్లలో శ్యాం కుమార్ అనే దళితుడిని అమానుషంగా చంపారు.. బీహార్ ని తలపిస్తుంది ఆంద్రా.. దళితులు ,ఎస్టి ,బీసి ల పై దాడులు జరుగుతుంటే మంత్రులకు సిగ్గు లేదా యాత్రలు చేయడానికి.. మంత్రి నాగార్జున కి మంత్రిగా కొనసాగే అర్హతేలేదు.. జబర్దస్త్ రోజా చెప్పినట్లు.. గన్ కంటే ముందు వస్తాడన్న జగన్ ఏమయ్యారు.. ప్రజలను డైవర్ట్ చేయడానికే సామాజిక బస్సుయాత్ర దళిత మహిళలపై దాడుల కేసుల్లో ఏపి దేశంలో నెంబర్ వన్ అని NCRB ప్రకటించింది. 26 వేల కోట్ల రూపాయిలు ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు డైవర్ట్ చేస్తే… ఏం చేస్తున్నారు దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు. 50 వేల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఖాలీ ఉన్నాయి. తమ జాతికి అన్యాయం జరుగుతున్నా ఏందుకు మౌనంగా ఉంటున్నాయి దళిత సంఘాలు..
పాశర్లపూడి జాతీయ రహదారి పై లారీ బోల్తా. స్వల్ప గాయాలతో బయటపడ్డ లారీ డ్రైవర్, క్లీనర్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుండి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు కోళ్ల మేత తో వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సును తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది . లారీ అద్దాలు పగలగొట్టుకుని లారీ డ్రైవర్, క్లీనర్ బయటికి రావడంతో తప్పిన ప్రాణాపాయం.
Read Also..
కోర్టు నిబంధనల మేరకు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వరకూ చంద్రబాబు కాన్వాయ్ సాగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. బాబుకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు చేస్తే ప్రభుత్వ సలహాదారు రామకృష్ణా రెడ్డి, వైసీపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ఛీకొడుతున్నా వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ రావటానికి చంద్రబాబుకు 16 గంటల సమయం పట్టింది. కోర్టు నిబంధనలు లేకపోతే ఇప్పుడు వచ్చినదానికంటే నాలుగు రెట్లు అధికంగా జనం వచ్చేవారు. చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించకుండా కారులోనే ఉండి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. లోకేశ్ ఢిల్లీ వెళితే వైసీపీ వాళ్లకెందుకు ఉలికిపాటు. అక్రమ కేసులో చంద్రబాబును 52 రోజులు నిర్బంధించారు. ఆయన అవినీతికి పాల్పడ్డట్టు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ అవకతవకలు జరిగాయంటూర మరో కొత్త కేసు పెట్టారు. వైసీపీ వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏమీ చేయలేరు’’ అని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలలో కొన్ని రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. ఇచ్చాపురం నియోజకవర్గం లోని మండలాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు. కంచిలి మండలంలోని మండపల్లి గ్రామంలో ఒక ఆవుల శాలపై పెద్దపులి దాడి చేసి ఒక ఆవును చంపింది. ఉదయం రైతు వచ్చి చూడగా ఒక ఆవు కనిపించడం లేదని గుర్తించాడు. ఆవు కోసం వెతికి చూడగా 100 మీటర్ల దూరంలో చనిపోయిన ఆవు కనిపించింది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. సమాచారం అందిస్తే గాని ఫారెస్ట్ అధికారులు రాకపోవడం, పెద్దపులి భారీ నుంచి ప్రజలను కాపాడే చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్న అటవీ శాఖ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. బెయిల్ మంజూరైన వెంటనే మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుని, తప్పు లేకపోయినా కేసులు పెట్టారనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసి పోయిందని అన్నారు. అక్రమ కేసులు పెట్టి, జైల్లో ఉంచి లబ్ధి పొందాలని జగన్ చూశారని విమర్శించారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని… పార్టీలో ఎవరు తప్పు చేసినా ఆయన సహించరని చెప్పారు. మహానుభావుడు చంద్రబాబును ఈ మూర్ఖుడు, ఈ దుర్మార్గుడు జగన్ 52 రోజుల పాటు జైల్లో పెట్టించారని అచ్చెన్న మండిపడ్డారు. బెయిల్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తే… రాత్రికి రాత్రే చంద్రబాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో అని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్ట్ జగన్ పతనానికి నాంది అని… బాబు జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన క్షణం నుంచే వైసీపీ పతనమవుతుందని చెప్పారు. వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతామని వ్యాఖ్యానించారు. హైకోర్టులో ఈరోజు తమకు న్యాయం జరిగిందని అన్నారు. ఇప్పటికే లోకేశ్ బాబు రాజమండ్రిలో ఉన్నారని… తాము కూడా ఇప్పుడు రాజమండ్రికి బయల్దేరుతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది అందరం కూర్చొని చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో పెద్దపులి సంచారిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు ఫారెస్ట్ అధికారులు.. మండపల్లి పంచాయితీ అమ్మవారి పుట్టుక గ్రామ పొలాల్లో పెద్దపులి అడుగులను గుర్తించారు.. గ్రామాన్ని సందర్శించిన జిల్లా అటవీ శాఖ అధికారిని నిషా కుమారి.. పులి అడుగుజాడలను పరిశీలించి స్థానికులకు తగు సూచనలు చేసారు






Total views : 82547