Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Latest News ఇసుక దందానే ముఖ్యం..

ఇసుక దందానే ముఖ్యం..

by Rama
Vivek venkataswami

చెన్నూరు నియోజకవర్గం కన్నా ప్రజల సమస్యకన్న ఇసుక దందానే బాల్క సుమన్ కు ముఖ్యం అని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మందమర్రి లొ గడప గడప కు కాంగ్రెస్ ప్రచారం లొ భాగంగా మాట్లాడుతూ… రోజుకు ఎన్ని లారీలు వస్తున్నాయి ఎంత వాటా వస్తుంది అనేదే సుమన్ లక్ష్యం. 2014 లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన పై పోటీ చేసినప్పుడు 100 కోట్లు వివేక్ వి 100 కేసులు నాయంటూ ప్రజలని మభ్యపెట్టిండు. Mp గా mla గా గెలిచి వెయ్యి కోట్లు బాల్క సుమన్ ఎట్ల సంపాదించిండని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాలను తెలుసుకుని బాల్క సుమన్ ను నిలదియ్యాలి. నేను ఏ పదవిలో లేనప్పటికి 10 ఏండ్లుగా ప్రజల కష్ట సుఖాలు పట్టించుకుంటు అండగా ఉంటున్న ప్రజలకు సేవ చేసేందుకె చెన్నూరు అసెంబ్లీ బరిలో నిలుచుంటున్న హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. సుమన్ అహంకారం తో ఆఫీసర్లను , నాయకులను, ప్రజలను తిట్టడం బెదిరింపులకు దిగడమే పని. పేదలకు డబులు బెడ్ రూమ్ లు ఇయలేదు గాని కేసీఆర్ తన mla, mp లకు పెద్ద బిల్డింగ్ లు కట్టి ఇచ్చిండు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..మందమర్రి మున్సిపాలిటీ కి ఎన్నికలు జరిపించేందుకు కృషి చేస్తాను అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తా అని తన ఇంటికే ఆరు ఉద్యోగాలు ఇప్పించుకున్నాడు. నెలకు 50 లక్షల జీతం కేసీఆర్ కుటుంబ సభ్యులకు వస్తున్నాయి కేసీఆర్ బులెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకున్నాడు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇళ్ళలు, ఫామ్ హౌజ్ లు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న పెదలకేమో డబుల్ బెడ్ రూమ్ లు లేవు. ముఖ్యమంత్రి కి అహంకారం పెరిగింది.. అవినీతిలో మునిగిపోయిండు మీటింగ్ లో నెను ఎక్కడ మాట్లాడిన అక్కడ బాల్క సుమన్ మనుషులు కరెంట్ కట్ చేస్తున్నారు. పవర్ కట్ చేస్తే.. నా మాటలు మీ దాకా వినిపియ్యవా. ధరణి ,కాళేశ్వరం, మిషిన్ భగీరథ ఇలా ప్రతి దానిలో కోట్లు కొల్లగొట్టారు. కాంగ్రెస్ మేనిపెస్టో లొ ఆరు గ్యారెంటీ కార్డును ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

013903
Total views : 78384

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.