Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh అనకాపల్లిలో రైతు బజార్‌ను ప్రారంభించిన నాయకులు.

అనకాపల్లిలో రైతు బజార్‌ను ప్రారంభించిన నాయకులు.

by CVR NEWS
అనకాపల్లిలో రైతు బజార్‌ను ప్రారంభించిన నాయకులు

అనకాపల్లి జిల్లాలోని ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్‌లో నూతన రైతు బజార్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. 2008 నుంచే రైతు బజార్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరిగాయని నాయకులు తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, వినియోగదారులకు ఉపయోగపడే విధంగా రాష్ట్రంలోనే విశాలమైన రైతు బజార్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.మార్కెట్ యార్డ్‌లో ఖాళీగా ఉన్న 17, 18 నెంబర్ బ్లాకుల్లో రైతు బజార్‌ను అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 100 దుకాణాలు ఏర్పాటు చేయగా.. అందులో 72 షాపులను రైతులకు, 25 షాపులను డ్వాక్రా సంఘాలకు, మూడు షాపులను దివ్యాంగులకు కేటాయించినట్లు వెల్లడించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018654
Total views : 89098

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.