పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో కాంగ్రెస్ మహిళా నాయకురాలు పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్లో చేరారు. ఆమెకు కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాగైనా లబ్ది పొందాలని కాంగ్రెస్, బీజేపీలు కొత్త కుట్రలకు తెరలేపాయని అనుమానం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఢిల్లీ పెద్దలు వదంతులు సృష్టిస్తారు.. రాష్ట్ర ప్రజలందరూ ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో కేసీఆర్ చక్రం తిప్పకుండా కుట్రలకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలే లక్ష్యంగా రాబోయే 15 రోజుల పాటు ఇవే కుట్రలకు ప్లాన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మన ఆలోచనలకు మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు.. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు గాడి తప్పొద్దు.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also..
Read Also..




Total views : 75177