Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Telangana మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ

మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ

by Satya
మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ

మూసీనది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నదీగర్భంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం.. విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సెర్ఫ్ సీఈవో ఛైర్మన్‌గా, జీహెచ్ఎంసీ కమిషనర్ వైస్ ఛైర్మన్‌గా 14 మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
మూసీ రివర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ దాన కిషోర్ కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ, బీసీ సంక్షేమశాఖతోపాటు పాఠశాల విద్య కమిషనర్, తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీలోని సభ్యులు..తమ తమ శాఖలకు సంబంధించిన కార్యాచరణను రూపొందించి 30 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది.

మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.