ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనార్టీల ద్రోహి అని మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని అజిజియా షాది మహల్ లో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని షాదీ మహల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అజీజీయ షాది మహల్ లో నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఎ షరీఫ్ మాట్లాడారు. వైసీపీ పాలనలో ముస్లిం మైనారిటీల మాన, ప్రాణాలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైసిపికి తొత్తుగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల వేధింపుల కారణంగా కొన్ని మైనారిటీ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బేల్ రద్దు కాకుండా ఉండడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిజెపి తొత్తుగా మారాడని మండిపడ్డారు. పార్లమెంటులో మైనారిటీల వ్యతిరేక బిల్లులు ఆమోదం పొందేందుకు వైసిపి ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికి మైనారిటీలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధం తండ్రి కొడుకుల బంధం అని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ పేర్కొనడంలోనే వైసిపికి కేంద్రం సహకరిస్తుందని స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా న్యూస్
అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనకు టికెట్ రాలేదన్న అసూయతో మూడు దపాలుగా ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని దిక్కరించి మాట్లాడడం పై రాయదుర్గం నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి సెగ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సోదరుడు అంపారెడ్డి కుమారుడు నవీన్ రెడ్డి స్వగృహంలో విలేకరుల సమావేశంలో వెల్లడి.
వైసీపీ యువనేత నవీన్ కుమార్ రెడ్డి కామెంట్స్:-
కాపు రామచంద్రారెడ్డి టికెట్ నెపంతో జగన్మోహన్ రెడ్డి గొంతు కోశారు అనడం విడ్డూరం.
ఆత్మ సాక్షిగా ప్రమాణం చేసుకొని 2009 నుండి 2019 వరకు మూడు దపాలుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకే ఎమ్మెల్యేగా గుర్తింపు పొందలేదా ? అన్యాయమైన దుర్మార్గమైన సర్వే అంటావా ? మీరు చేసిన అవినీతి అక్రమాలు జగన్మోహన్ రెడ్డి మీతో చర్చించ లేదా ఇది వాస్తవం కాదా ?
గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో క్రియాశీలకంగా పని చేసిన పార్టీ నాయకులను నీ స్వలాభం కోసం అడ్డొస్తారని, పార్టీ కార్యక్రమాలకు దూరం చేయలేదా ?
నియోజకవర్గంలోని కనేకలు బొమ్మనహాలు మండలాల్లో కార్యకర్తలపై అక్రమ కేసులులో విరికించి హింసించలేదా ?
కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నావే ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో నీ వెంట ఎంతమంది ఉన్నారో చూసుకో!
రాయదుర్గం సబ్ రిజిస్టర్ ద్వారా తమకు డబ్బులు ఇవ్వమని అధికారులను హింసించలేదా తద్వారా ఆరు నెలలుగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ప్రభుత్వ నిధి గండి కొట్టలేదా?
రామచంద్ర రెడ్డి ఇప్పటికైనా ప్రజా సుపారీలకు పాలన కోసం వైయస్సార్ లో ఉండి ఐక్యత కోసం పోరాడు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు మా ఇంట్లో ఉన్నాయని చెప్పుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనాలు గుండెల్లో ఉండాలి.





Total views : 75427