తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఇంటింటికి ప్రచారంలో భాగంగా ,శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ నుండి నగరం నడిబొడ్డులోని సదా శివ టవర్స్ వేదిక వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ కోట వినుత మరియు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు. ఇంటింటికి ప్రచారం అనే నినాదంతో వైయస్సార్సీపి చేసిన అవకతవకల పనులన్నీ ప్రజలకు తెలియజేస్తామని, వైయస్సార్సీపి పార్టీకి చివరి రోజులు గడుస్తున్నాయని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి జనసేన పార్టీ – తెలుగుదేశం కలయికతో విజయం సాధిస్తామని కోట వినుత తెలిపారు.
Tag:
తిరుపతి జిల్లా
పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా పోలీస్ శాఖ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాలోని పోలీసులతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన పోలీసులకు ,విద్యార్థులకు, ప్రజలకు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.