తిరుమలలో అన్నప్రసాద విరాళం పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాన్ని అందించే పథకానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం ప్రారంభించింది. ఇందుకోసం ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం రూ.38 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విరాళం మొత్తం గతంలో రూ.33 లక్షలు ఉండగా, ఆ మొత్తాన్ని టీటీడీ రూ.38 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.పెరిగిన ధరల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇదే సమయంలో మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఉదయం అల్పాహారం కోసం రూ. 8 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.15 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.15 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని టీటీడీ పేర్కొంది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చని టిటిడి ప్రకటించింది.
andhra pradesh
ఏపీలోని ప్రముఖ దేవాలయాలు మూతపడనున్నాయి. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులు మూసివేస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. నేడు సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం గుడి తలపులు మూయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజలు చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నేడు మూతపడనుంది. ఈ రోజు ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేయనున్నారు. 29 న ఉదయం 8 గంటల నుంచి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఈ గ్రహణం కారణంగా ప్రముఖ ఆలయాలు మూతపడనున్నాయి. శనివారం రాత్రి ఆలయాలు తలుపులు మూయనున్నారు. మళ్లీ ఆదివారం తెల్లవారుజామున తలుపులు తెరుచుకోనున్నాయని అధికారులు తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అత్యవసర పిటిషన్ దాఖలుకు హైకోర్టు నిరాకరించింది. వ్యాజ్యం దాఖలుకు అనుమతినిచ్చి అత్యవసరంగా విచారణ జరపాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. తనకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైద్యులు సైతం నివేదికలు ఇచ్చారని చంద్రబాబు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్లో ఎడమ కంటి శుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నానని తెలిపారు. సెప్టెంబరులోపు కుడి కంటికి సైతం చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారన్నారు. ప్రస్తుతం కుడి కంటి చూపు మందగించిన కారణంగా అత్యవసరంగా శస్త్ర చికిత్స అవసరమని వివరించారు. జాప్యం చేస్తే చూపు పూర్తిగా మందగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీనిపై కంటి వైద్య నిపుణులు ఈనెల 21న ఇచ్చిన నివేదికను కోర్టు ముందు ఉంచారు. మధ్యంతర బెయిలు కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ విచారణ జరపనుంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందు ఈ పిటిషన్ విచారణ జాబితాలోకి వచ్చింది. చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో సీఐడీ అధికారులు ఎవరితో మాట్లాడారు, వారి ఫోన్ కాల్ డేటా రికార్డులను భద్రపరిచేలా ఆదేశించాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ పిటిషన్పై సీఐడీ కౌంటర్ దాఖలుచేసింది. కాల్ డేటా బయటకు వెల్లడించడం వల్ల దర్యాప్తు అధికారుల భద్రతకు నష్టం కలుగుతుందన్నారు. గోప్యతకు భంగం కలుగుతుందని పేర్కొంది. చంద్రబాబును అరెస్టు చేసి సీఐడీ కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో తమ అనుమతి లేకుండా మీడియా. వీడియో, ఫోటోలు తీసుకుందన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఉదయం తెల్లవారుజామున నుండి దట్టమైన పొగ మంచు కురుస్తుంది. దీంతో వాహన చోధకులు పొగ మంచులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పొగ మంచుతో చింతపల్లిలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. దట్టమైన పొగ మంచుల ఆనందించాలంటే టూరిస్టులకు చింతపల్లి లంబసింగి కొత్తపల్లి జలపాతాలు. వంజరి మంచు సోయగాలు, చెరువులు, తాజ్ంగి డ్యాం పర్యాటలకు అనుకూలమైన ప్రదేశలుగా ఉన్నాయి. టూరిస్టులు ఎవరైనా ఈ ప్రాంతాలకు వచ్చి అందమైన వాతావరణాన్ని అనుభవించవచ్చని చింతపల్లి యూత్ అంటున్నారు.