అయోధ్యలోని బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతం శ్రీరామ నామ జపంతో మార్మురోగింది పట్టణం మండలాల్లోని అన్ని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధనలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన స్టీమర్ రోడ్డు రామాలయంలో వేద పండితులు శేషాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని భారీ అన్న సమారాధన నిర్వహించారు. పాత బజార్ రామాలయంలో శోభాయాత్ర, ఆర్యవైశ్య రామాలయంలో రామ జపం , హనుమాన్ చాలిస్ పఠించారు. అనంతరం పలు రామాలయాల్లో దీపాలు వెలిగించి రామ జప నామాన్ని పఠించారు.
ayodhya prana prathista
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం ఈ రోజు అయోధ్యలోని రామ మందిరం లో బాల రాముని విగ్రహ ప్రతిష్టించుకోవడం కోసం 500 సంవత్సరాలు వేచి చూశామని ఈరోజు నెరవేరిందని విగ్రహన్ని ప్రతిష్ట చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని రామభక్తులు వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఊరు వాడ భక్తిశ్రద్ధలతో శ్రీరామ నామంతో మారుమోగింది వీధి వీధి వాడవాడ భక్తిశ్రద్ధలతో చిన్నలు పెద్దలు అన్న తేడా లేకుండా శ్రీరామ నామస్మరణతో మారుమోగించారు. హిందువుల యొక్క చిరకాల కోరిక అయోధ్య రామ మందిరం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు భారతదేశనికే కాకుండా ప్రపంచ దేశంలో కూడా రాముని యొక్క ప్రతిష్టను పొగుడుతూ రాముని యొక్క గుణగణాలను కీర్తిస్తు దేశంలో మళ్ళీ రామరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని వ్యక్తం చేసారు.
అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఏలూరులో ధర్మబేరి ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించారు. ఉదయం నుండి హనుమాన్ చాలీసా పారాయణం, అనంతరం యాగ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ సంఘాల నేతలతో పాటు పలువురు ముస్లిం సోదరులు పాల్గొని అయోధ్య లోని బాలరామ విగ్రహ ప్రతిష్టకు సంఘీభావం తెలిపారు.



Total views : 89922