పనికి తగ్గ ప్రతిఫలం కోసం పోరాడుతున్న తమపై మహిళలు అనే కనికరం లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం దారుణమని అంగన్వాడీ మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు. గత 33 రోజులు గా నిరసన తెలుపుతున్నా… ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తునందుకు నిరసన గా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద నుండి ర్యాలీ నిర్వహించి స్థానిక బోసు బొమ్మ సెంటర్ వద్ద తమ న్యాయ బద్ధమైన పోరాటానికి ప్రజా మద్దతు ఇవ్వాలని సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో సి ఐ టీ యూ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Tag:





Total views : 90185