శ్రీకాకుళం జిల్లా, నిజం గెలవాలి పేరుతో నేడు శ్రీకాకుళం, మన్యం జిల్లాల లో పర్యటించనున్న నారా భువనేశ్వరి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో మనస్థాపానికి గురై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరి. రాజాం జి.ఎం.ఆర్ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం దవలపేట గ్రామానికి చేరుకొని మృతి చెందిన కంచరాన అసిరినాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న భువనేశ్వరి. అనంతరం అక్కడ నుండి మన్యం జిల్లా
భామిని మండలం బిల్లమడ గ్రామానికి చేరుకొని బిల్లమడ గ్రామంలో మృతి చెందిన బర్రి విశ్వనాథం కుటుంబాన్ని పరామర్శ. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం తోటాడ గ్రామం చేరుకొని తోటాడ గ్రామంలో గేదెల సాంబమూర్తి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం దన్నానపేట గ్రామంలో మృతి చెందిన గొర్లె తిరుపతిరావు కుటంబాన్ని పరామర్శిస్తారు. ఆమదాలవలస మండలం పాత నిమ్మతొర్లాడ గ్రామం చేరుకొని ఆగ్రామంలో మృతి చెందిన ఆకేటి పాపయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు.
cvr om
పుదుచ్చేరి యానాం నుండి అనధికారికంగా ప్రత్యేకంగా తయారుచేసిన ట్యాంకర్ ద్వారా డీజిల్ తరలించి ఆంధ్ర ప్రాంతంలో అమ్మకాలు సాగిస్తున్న ముఠా ను ముమ్మిడివరం పోలీసులు పట్టుకున్నారు. యానాం కు ఆంద్రా ప్రాంతానికి లీటర్ డీజిల్ కు రూ.12 రూపాయలు వరకూ వ్యత్యాసం ఉండటంతో ఈ అక్రమరవాణా చేసి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. యానాం నుండి ఆత్రేయపురం తరలిస్తున్నట్లుగా అందిన సమాచారం తో ట్రయినీ డిఎస్పీ విష్ణు స్వరూప్ ఆధ్వర్యంలో పోలీసులు ట్యాంకర్ డ్రైవర్ తో పాటు అందులో ఉన్న మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సప్లయి అధికారులను రప్పించి వారి సహకారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ట్యాంకర్ లో సుమారు 3వేల లీటర్ల డీజిల్ ఉన్నట్లు సమాచారం.
మల్లంపేట ,ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న ఇంతియాజ్ మహమ్మద్, రూబీనా బానో(30) భార్యాభర్తలు. ముగ్గురు పిల్లలు కుమార్తె ఆల్సిత, కుమారులు సూఫీయాన్, అనాష్ ఈ నెల 2న భర్త ఇంటికి వచ్చి చూడగా భార్య పిల్లలు కనబడుట లేదని ఫిర్యాదు. తాను ఉదయం 10 గంటలకు పనిమీద మియాపూర్ కు వెళ్లి సాయంత్రం 5 గంటలకు భార్యకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది, సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చిన అతనికి భార్యా పిల్లలు ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించిన భర్త. ఈ రోజు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త ఇంతియాజ్ మహ్మద్. ఫిర్యాదు స్వీకరించిన దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
శివుడు హిందూమతంలో ఒక ముఖ్యమైన దేవుడు. అతను శివలింగం రూపంలో పూజించబడతాడు. శివుడికి అభిషేకం చేయడం ఒక ముఖ్యమైన పూజా విధానం. అభిషేకం అనేది శివుడిని పవిత్రమైన ద్రవాలతో అభిషేకించడం. శివుడికి అభిషేకం చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.
- శివుడి అనుగ్రహం పొందడానికి: శివుడు దయగల దేవుడు. అతనిని భక్తితో పూజిస్తే, అతను తన భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. శివుడికి అభిషేకం చేయడం వల్ల అతని అనుగ్రహం పొందవచ్చు.
- పాపాలను పోగొట్టుకోవడానికి: శివుడు పాపాలను పరిహరించే దేవుడు. అతనికి అభిషేకం చేయడం వల్ల పాపాలు పోగొట్టుకోవచ్చు.
- మోక్షాన్ని పొందడానికి: శివుడు మోక్షాన్ని ప్రసాదించే దేవుడు. అతనికి అభిషేకం చేయడం వల్ల మోక్షాన్ని పొందవచ్చు.
- ఆరోగ్యం మరియు సంపదను పొందడానికి: శివుడు ఆరోగ్యం మరియు సంపదను ప్రసాదించే దేవుడు. అతనికి అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం మరియు సంపదను పొందవచ్చు.
- కష్టాలను తొలగించడానికి: శివుడు కష్టాలను తొలగించే దేవుడు. అతనికి అభిషేకం చేయడం వల్ల కష్టాలను తొలగించవచ్చు.
శివుడికి అభిషేకం చేయడానికి అనేక రకాల ద్రవాలను ఉపయోగించవచ్చు. వాటిలో పాలు, నీరు, పంచామృతాలు, చందనం, పూలు, పువ్వుల రేకులు, ధూపం, దీపాలు మొదలైనవి ఉన్నాయి. శివుడికి అభిషేకం చేయడానికి సరైన సమయం ఉదయం లేదా సాయంత్రం. అభిషేకం చేయడానికి ముందు, శివలింగం శుభ్రంగా ఉండాలి.
శివుడికి అభిషేకం చేయడం ఒక శక్తివంతమైన పూజా విధానం. ఇది శివుడి అనుగ్రహం, మోక్షం, ఆరోగ్యం, సంపద మరియు కష్టాలను తొలగించడానికి సహాయపడుతుంది.
కార్తీకమాసం పరమశివుడు పరమశించే నెల. ఈ కార్తీకమాసంలో మాత్రమే వన సమారాధన నిర్వహిస్తారు. కార్తీక దామోదరునికి పూజలు చేసి ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టి అందరూ ఐక్యంగా ఉండేందుకు, ఆధ్యాత్మిక భావాలు పెంచేందుకు ఈ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో జరిగిన వన సమారాధన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. నేడు వన సమారాధనలు కుల సమారాధనలుగా మారిపోయాయి. అదేవిధంగా ఆధ్యాత్మికత కనపడటం లేదు. ఆర్కెస్ట్రాలు, రికార్డింగ్ డాన్స్ లు పెడుతున్నారు. కానీ గొల్లపాలెంలో నిర్వహించిన వన సమారాధన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ప్రత్యేకంగా పరమశివుని లింగాన్ని ఏర్పాటు చేశారు. ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. గ్రామంలో స్వామివారి గ్రామ సేవ నిర్వహించారు. సుమారు మూడు వేల మందికి పైగా కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు. కార్తీక దామోదరుడు పరవశించాడా, పరమశివుడు ఆశీర్వదించాడా అన్న చందాన ఆ సమయంలో వర్షం కూడా పడలేదు. చల్లని గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఓ పక్క ఆధ్యాత్మిక వాతావరణం. మరోపక్క శివ లీలామృతం. మరో పక్క భక్తుల సందడి. వెరసి కార్తీక వన సమారాధనకు నిజమైన నిర్వచనం ఇచ్చాయి. వీరయ్య చౌదరి నేతృత్వంలో హర హరా.. శివ శివా అంటూ కార్తీక్వన సమారాధనలో పాల్గొన్న భక్తులు శివతాండవంతో ఊగిపోయారు. వన సమారాధన ఇలా ఉండాలి. ఆధ్యాత్మికత అంటే ఇదేవిధంగా నిర్వహించాలి అన్న భావం ప్రతి ఒక్కరిలో కలిగింది.
రాయచోటిలోని సుద్దల వాండ్ల పల్లి రోడ్డు మార్గంలో వెలిసిన మణికంఠ గిరి అయ్యప్ప స్వామి దేవాలయం లో శుక్రవారం రాత్రి సురేష్ రెడ్డి, సాయి కుమార్ యాదవ్, గంగిరెడ్డి స్వామి ల అధ్వర్యంలో అంబులం పూజ నిర్వహించారు.ఆలయ ధర్మ కర్త, గురు స్వామి అయిన బసిరెడ్డి స్వామి శాస్త్రోక్తంగా అయ్యప్ప స్వామికి అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు.అంబులం పూజ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం భక్తులను బాగా ఆకట్టుకొంది. అయ్యప్పకు వినాయకునికి, సుబ్రమణ్యం స్వామి విగ్రహాలు ప్రత్యేక అలంకరణ చేశారు.అయ్యప్ప స్వామి గురు స్వాముల భక్తి పాటలతో మణికంఠ గిరి పులకరించింది. అంబులం పూజలో ఏర్పాటుచేసిన 18 మెట్ల మండపం అయ్యప్ప స్వామి భక్తులను ఎంతగానో ఆకర్షించింది. పూజ అనంతరం కార్యక్రమం నిర్వహించిన కుటుంబ సభ్యులు స్వాములకు బిక్ష ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…




Total views : 89163