దేశంలో మరో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది. నోయిడాలో నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించనున్నారు. ఢిల్లీ రద్దీకి పరిష్కారంగా ఈ కొత్త ఎయిర్పోర్ట్ పెద్ద ఊరటగా నిలవనుంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉంది.ప్రయాణికుల సంఖ్య పెరగడంతో, ముఖ్యంగా పీక్ టైమ్లలో ఈ ఎయిర్పోర్ట్పై తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది.దీంతో మరో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అవసరం చాలాకాలంగా వ్యక్తమవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.11,200 కోట్ల వ్యయంతో నోయిడాలోని జేవర్ ప్రాంతంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ఆధునిక సౌకర్యాలతో సిద్ధమైంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ ను ఈరోజు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.అనంతరం ఆయన టెర్మినల్ను కూడా పరిశీలించనున్నారు. ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాగానే ఢిల్లీ ఎయిర్పోర్ట్పై ఉన్న ప్రయాణికుల భారం గణనీయంగా తగ్గనుంది.
Tag:





Total views : 61868