ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర చాలా ముఖ్యం. అవును నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏకాగ్రత, శ్రద్ధ, నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది. అందుకే రాత్రిపూట కనీసం ఏడు గంటల పాటైనా నిద్రపోయేలా చూసుకోండి. మీరు సరిగ్గా నిద్ర లేకపోతే ఉదయం లేచిన వెంటనే చిరాకు కలుగుతుంది. ఆ రోజంతా మీరు చిరాకుగానే ఉంటారు. అలాగే ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు మొదలైనవి వచ్చే అవకాశం కూడా ఉంది. నిద్రలేమి హృదయ సంబంధ వ్యాధులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదకరమైన రోగాలేమీ రాకూడదంటే మీరు కంటినిండా నిద్రపోవాలి. నిద్రలేమి వల్ల కూడా ఎన్నో చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది కూడా మీ చర్మ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్రలేమి వల్ల మీ చర్మం పొడిబారడం, ముడతలు పడటం, తామర వంటి చర్మ సమస్యలొచ్చే ప్రమాదం పెరుగుతుంది. మీరు రాత్రిపూట సరిగ్గా నిద్ర లేకపోతే మీ ఇమ్యూనిటీ పవర్ పై ప్రభావం పడుతుంది. తక్కువ గంటలు నిద్రపోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఫలితంగా మీకు ఎన్నో వ్యాధులు, అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల మీరు తరచూ అనారోగ్య సమస్యల బారిన పడతారు. నిద్ర లేకపోవడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత, డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల మీ ఆకలి హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది ఆకలి, అనారోగ్యకరమైన ఆహారం కోసం మీలో కోరికలను పెంచుతుంది. దీంతో మీరు విపరీతంగా తిని బాగా బరువు పెరుగుతారు.
diabetes
చాలామందిని పట్టిపీడిస్తున్న వ్యాధులలో మధుమేహం ఒకటి. ఇది శరీరంలో అనియంత్రిత చక్కెర స్థాయి కారణంగా సంభవిస్తుంది. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి 250 కంటే ఎక్కువ ఉంటే, వైద్యుడి వద్దకు వెళ్లడం మంచిదని చెబుతారు. బొప్పాయి తినడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అయితే అది ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర స్థాయిని నియంత్రించడానికి, డయాబెటిక్ రోగులు బొప్పాయితో సిట్రస్ పండ్లను తీసుకోవచ్చు. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిని సరిగ్గా ఉంచుతుంది. ఇలా చేయడం వల్ల ఉదర సమస్యలు కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఈ రెండింటిని కలిపి తింటే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. మీకు కావాలంటే, మీరు బొప్పాయి మరియు నారింజ వంటి సిట్రస్ పండ్ల స్మూతీని తయారు చేసి తినవచ్చు. బొప్పాయిని సరైన మోతాదులో తింటే. అది వారి చక్కెర స్థాయిపై చెడు ప్రభావం చూపదని నిపుణులు అంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు పండిన బొప్పాయిని సరైన పరిమాణంలో రోజూ తినవచ్చు. సలాడ్ రూపంలో కూడా దీన్ని తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. బొప్పాయిని అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం మధ్య లేదా లంచ్ మరియు డిన్నర్ మధ్య తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అల్సర్ లతో బాధపడేవారికి అరటి పండ్లను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. డయాబెటిస్ రాకుండా, బీపి కంట్రోల్ లో ఉండేలా చేయగలిగిన శక్తి అరటిపండులో ఉందని చెబుతున్నారు. అధిక ఫైబర్, ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ కు చెక్ పెట్టొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇక డయాబెటిస్ బాధితులు కూడా అరటి పండ్లను తినొచ్చు అని అయితే బాగా మిగల పండిన అరటి పండ్లను తినకూడదు అని చెబుతున్నారు. అరటి పండ్లను తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ నుండి కూడా కాపాడుకోవచ్చని, చర్మ సంబంధమైన సమస్యల నుండి కూడా బయట పడవచ్చని చెబుతున్నారు. శరీరానికి అరటిపండు నిగారింపును ఇస్తుంది అని, జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అని చెబుతున్నారు.
చెరకురసంలోని లవణాలు నోటి దుర్వాసనను వదిలించి దంతాలు పుచ్చిపోకుండా కాపాడతాయి. కామెర్ల వ్యాధి తగ్గించడంలో చెరకు రసం మహత్తరంగా పనిచేస్తుంది. జ్వరాన పడ్డప్పుడు కోల్పోయిన ప్రొటీన్ను చెరకు రసం భర్తీ చేయడంలో తోడ్పడుతుంది. మూత్ర సంబంధ సమస్యలను చెరుకు రసం పరిష్కరిస్తుంది. కేన్సర్తో పోరాడే శక్తినిస్తుంది. ముఖ్యంగా ప్రొస్టేట్, బ్రెస్ట్ కేన్సర్ల చికిత్సకు ఎంతో ఉపకరిస్తుంది. శరీర బరువును తగ్గిస్తుంది. గొంతు నొప్పి, ఫ్లూ, జలుబును తగ్గిస్తుంది. చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడమే కాక, కణాలు నాశనం కాకుండా చూస్తాయి. దీంతోపాటు శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. మధుమేహం ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా చెరుకు రసాన్ని తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు.
వారంలో మూడు గుడ్డు సొనలు తీసుకోవడం వల్ల మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధులను కట్టడి చేసే అవకాశం ఉన్నట్లు ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. గుడ్డు పచ్చసొన యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కానీ నిర్దిష్టంగా చెప్పాలంటే, ఇది విటమిన్ డి మరియు ఐరన్ వంటి ఇతర పోషకాలకు మంచి మూలం అని చెప్పొచ్చు. రోజుకు రెండు నుంచి నాలుగు గుడ్లలోని తెల్ల సొనను తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రోజుకు ఒకటి నుంచి రెండు గుడ్లలో ఉండే తెల్ల సొన మాత్రమే తీసుకుంటే గుండెకు మంచిదని వైద్యులు చెబుతున్నారు.
Read Also..
Read Also..
చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే చేపల్లో బీపీని, కొలెస్ట్రాల్ ని, డయాబెటిస్ ని కంట్రోల్ చేసే గుణాలు ఉంటాయి. అంతేకాకుండా చేపల్లో నాణ్యమైన ప్రోటీన్లు ఉంటాయి. వారానికి రెండుసార్లు చేపలు తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్, బీపీ, మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. చేపలని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. నిరోధక శక్తి పెరగడానికి కూడా చేపలు ఎంతో దోహదపడుతాయి. చేపలు శరీరానికి చాలా అవసరం ఎందుకంటే చేపల్లో మంచి కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా చేపల్లో ఒమేగా – 3 ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. కడుపులో మంట, వేడి తగ్గాలన్న తప్పనిసరిగా చేపలు తీసుకోవాలి. ఇంకా ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు చేపలు తినడం వల్ల నొప్పులు తగ్గడమే కాకుండా కండరాల శక్తిని పెంచుతాయి. అలాగే అల్జీమర్స్, డిమెన్షియా, మతిమరుపు వంటి లక్షణాలను చేపలు తగ్గిస్తాయి. చేపల్లో విటమిన్ – డి అధికంగా ఉండటం వల్ల ఎముకలు గట్టిగా ఉండేటట్లు తెలుస్తాయి. అంతేకాకుండా రొమ్ము క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా చేపలు అడ్డుకుంటాయి. చేపల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని గ్లోబిన్ శాతం సరిపడేలా చేస్తుంది. పేగులో క్యాన్సర్ ఇతరత్రా సమస్యలు రాకుండా చేస్తుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించి ఎనర్జీగా ఉండేటట్లు చేస్తాయి. అందుకే చేపలను తప్పనిసరిగా తినాలి. చేపల్లో అయోడిన్ ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. కడుపులో బిడ్డకు మెదడు పెరిగేందుకు ఉపయోగపడతాయి. మన శరీరంలో మెగ్నీషియం సరిపడా లేకపోతే చేపలను తినడం వల్ల అది మన శరీరానికి అందుతుంది. దీనివల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. అందుకే చేపలను తప్పనిసరిగా తినాలి. చేపల్లో వుండే పొటాషియం శరీరంలో ద్రవాలు తయారవడానికి చాలా అవసరం. కణాలు సమర్థవంతంగా పనిచేయడానికి పొటాషియం చాలా అవసరం అందుకే చేపలను తినడం వల్ల పొటాషియం అందుతుంది.
ఆకులు గుండెకు, పేగులకు మంచి ఔషధం. పైత్యం అధికంగా ఉన్నప్పుడు ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెమ్చాడు తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. కామెర్ల వచ్చిన వారికి, లివర్ సిర్రోసిస్తో బాధపడుతున్న వారికి ఆకుల దంచి కాచిన రసం తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొంత గుణం కనిపిస్తుంది. ఆకును దంచి పేస్ట్గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. వెంట్రుకలు నిగనిగలాడతాయి. ఆకులను దంచి పేస్ట్గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది. కంటి నుండి అదే పనిగా నీరు కారతుంటే ఆకులను శుభ్రమైన వస్త్రంతో కట్టి రాత్రి పూట కంటికి కట్టాలి. వైట్హెడ్స్ నివారణలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఔషధం మెంతి ఆకుల మిశ్రమం. తాజాగా ఉండే గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖంమీద వైట్హెడ్స్ అధికంగా ఉండే చోట బాగా అప్లయ్ చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. తెల్లారగానే లేచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు వైట్హెడ్స్ బారినుంచి విముక్తి అవ్వచ్చు.
Read Also..
Read Also..
ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు శరీరానికి అందాల్సిందే. ఏ ఒక్క విటమిన్ లోపించినా. శరీరం అనారోగ్యానికి గురికావాల్సిందే. ఇక విటమిన్ ‘డి’ గురించి చెప్పనక్కరలేదు. దీని అవసరం శరీరానికి, ఆరోగ్యానికి చాలా అవసరం. కండరాలు, ఎముకలు ప్రతి ఒక్క భాగం ఆరోగ్యంగా ఉండాలంటే. విటమిన్-డి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. దీని లోపం వల్ల మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ‘విటమిన్-డి’ తక్కువగా ఉండటం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా స్త్రీలతో ఈ సమస్య నానాటికి పెరుగుతూనే ఉంది. ఎముకలకు కావాల్సిన క్యాల్షియమ్ను శోషించుకోవడానికి, కండరాలు బలహీనం కాకుండా రక్షించడానికి విటమిన్-డి తోడ్పడుతుంది. ‘విటమిన్-డి’ని సూర్యకాంతి నుంచి సులభంగా పొందవచ్చు. అలా కాని పక్షంలో డాక్టర్ సూచనతో విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. శరీరంలో విటమిన్-డి తక్కువైతే. నీరసం, నడుము నొప్పి, జుట్టు రాలడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. విటమిన్-డి లోపం వల్ల కండరాల బలహీనత, డిప్రెషన్ విటమిన్-డి సమస్యలు వేధిస్తాయి. ఎముకల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. మెదడు పనితీరుపైనా దీని ప్రభావం ఉంటుంది. గుండె పనితీరు చురుకుగా ఉండటంలో విటమిన్-డి ప్రధానపాత్ర పోషిస్తోంది. అధిక రక్తపోటు సమస్యలున్నవారు ‘విటమిన్-డి’ అశ్రద్ధ చేయకూడదు. బద్దకం, అలసట, నిరుస్సాహం, కోపం వంటి లక్షణాలు కూడా విటమిన్-డి లోపానికి సంకేతాలు. శరీరానికి అవసరమైన ‘డి’ విటమిన్ తీసుకోవడం వల్ల ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాము. గుడ్డులో పసుపు సొన, ఆర్గాన్ మీట్స్, ఆయిల్స్, పాలు, ఛీజ్, పన్నీర్, నెయ్యి, వెన్నలో ‘విటమిన్-డి’ పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. పుట్టగొడుగులో విటమిన్ డి సమృద్ధిగా దొరుకుతుంది. తరచుగా వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ ఒక గుడ్డు పూర్తిగా తీసుకుంటే విటమిన్-డి లోపం రాదు. శరీరంలో విటమిన్ ‘డి’ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఉదయపు ఎండలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకుంటే విటమిన్-డి లోపాలు ఉండవు. ఎండలో నడవడం, వ్యాయామం చెయ్యడం లాంటివి చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. విటమిన్ డి లోపం ఉన్నవారు డాక్టర్ సూచనతో సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఎక్కవగా తీసుకున్న ప్రమాదమే.
మెట్ఫార్మిన్ అనేది టైప్ 2 డయాబెటిస్కు చికిత్స చేయడానికి ప్రపంచంలో అత్యంత విస్తృతంగా సూచించబడిన మందు, మరియు ఇది 60 సంవత్సరాలకు పైగా ఉంది! కానీ ఇప్పుడు, ఈ ప్రసిద్ధ ఔషధం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉండవచ్చని పరిశోధకులు నేర్చుకుంటున్నారు.
టైప్ 2 డయాబెటిస్కు చికిత్స చేయడానికి ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్లకు పైగా ప్రజలు ఈ చిన్న మాత్రను తీసుకుంటారు.
కరెన్ ఎల్కిండ్-హిర్ష్, పిహెచ్డి, డైర్., ఉమెన్స్ హాస్పిటల్లో సైంటిఫిక్ రీసెర్చ్, బటాన్ రూజ్ ఇలా వివరించాడు, “అత్యంత సాధారణంగా ఉపయోగించే ఔషధం, ఇది బహుశా ఇక్కడ నీటిలో ఉండవచ్చు, మెట్ఫార్మిన్ – దాని గురించి అందరికీ తెలుసు.”
53 విభిన్న అధ్యయనాల యొక్క పెద్ద సమీక్షలో మెట్ఫార్మిన్ మధుమేహంపై దాని ప్రభావంతో పాటు క్యాన్సర్, గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వంటి మరణాల యొక్క అన్ని కారణాలను తగ్గిస్తుందని నిర్ధారించింది. మెట్ఫార్మిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్లను కూడా కలిగి ఉందని నిపుణులు నమ్ముతారు, ఇది వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసే సామర్థ్యానికి దోహదం చేస్తుంది.
ఎల్కిండ్-హిర్ష్, PhD, “మా మధుమేహం సంభవం విపరీతంగా పెరుగుతోంది మరియు ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి.”
ఔషధం టైప్ 2 డయాబెటిస్ను నిరోధించవచ్చని పరిశోధనలు సూచించాయి. ఒక పెద్ద అధ్యయనంలో, మెట్ఫార్మిన్ తీసుకున్న మధుమేహం లేని వ్యక్తులు వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని 30 శాతం తగ్గించారు!
“గర్భధారణ సమయంలో కూడా చాలామంది దీనిని తీసుకుంటారు ఎందుకంటే ఇది చాలా సురక్షితమైన మందు.” ఎల్కిండ్-హిర్ష్, PhD చెప్పారు.
ఇంకా ఏమిటంటే: మెట్ఫార్మిన్ చవకైనది – రోజుకు కేవలం పెన్నీలు ఖర్చవుతుంది, కానీ ఇది కొన్నిసార్లు వికారం, అతిసారం, అపానవాయువు మరియు కడుపునొప్పికి కారణమవుతుంది. చాలా కాలం పాటు మెట్ఫార్మిన్ తీసుకోవడం కూడా విటమిన్ బి లోపానికి దారితీస్తుంది. చాలా మంది రోగులకు, ఈ లక్షణాలు స్వల్పంగా ఉంటాయి మరియు కొంతమందికి, సంభావ్య యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు విలువైనవిగా ఉండవచ్చు.
మెట్ఫార్మిన్ వాడకం మితమైన బరువు తగ్గడాన్ని కూడా ప్రేరేపిస్తుంది. సగటున, చాలా మంది ప్రజలు ఒక సంవత్సరం పాటు మెట్ఫార్మిన్ తీసుకున్న తర్వాత ఆరు పౌండ్లను కోల్పోతారు.
రుద్రాక్షలు ధరించుట వలన దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అన్ని వర్ణములవారు ధరించవచ్చును. రుగ్మతలు నియంత్రించడానికి , ఆరోగ్య సమస్యల పరిష్కరారానికి , శరీరములో చక్రాలను సమతుల్యపరిచేందుకు , ఆరా క్లెన్సింగ్ కు వీటిని ఉపయోగిస్తారు. రుద్రాక్షను జీవితాన్ని పరిరక్షించే ఔషధం లేదాగింజగా భావిండము పరిపాటి. రుద్రాక్షలను ధరిందడము లేదా నీటిలోవేసి ఉంచడము ద్వారా వివిధ రూపాల్లో వాడి ప్రయోజనాలు పొందవచ్చును. నీళ్ళలో రుద్రక్షను వేసి ఆ నీరు తాగడము వల్ల శారీరక ఉష్ణోగ్రను సరిచేయవచ్చును. శరీరము నుండి విషతుల్యాల్ని వెలికి నెట్టవచ్చును. ఇది చర్మాన్ని కాంతివంతముగా ఉంచుతుంది. గుండె సంబంధిత రుగ్మతలను , రక్తపోటును , ఉదరసమస్యలు , తలనొప్పి , డయాబిటీస్ , రక్తహీనత , స్థూలకాయము , మబద్దకము మొదలైనవాటిని అరికట్టడములో రుద్రాక్షలు సహకరిస్తాయి.





Total views : 61960